తిరుమలలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి జీఎన్ఎస్ టోల్ గేట్ దగ్గర జరిగిన ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. అయితే అదృశ్టవశాత్తూ కారులో ఉన్న ప్రయాణికుడు క్షేమంగా బయటపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.

అయితే సాంకేతిక లోపం వల్లనే కారులో మంటలు చెలరేగి ఉంటాయని అనుకుంటున్నారు. TTD భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కాసేపు నిలిచిపోయింది. పోలీసులు ఈ ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేస్తున్నారు. “సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
మరోవైపు శుక్రవారం రోజు కూడా తిరుమలలో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఓ కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో భక్తులు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. అదే సమయంలో తెలంగాణ నుంచి కూడా కొంతమంది భక్తులు మరో కారులో తిరుమలకు వచ్చారు.
అయితే మొదటి ఘాట్ రోడ్డులోని రెండో మలుపు వద్ద తమిళనాడు భక్తులు ప్రయాణిస్తు్న్న కారు అదుపు తప్పి ముందున్న తెలంగాణ భక్తులు ఉన్న కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లలోకి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో టీటీడీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని.. ఘాట్ రోడ్డులోని వాహనాలను పక్కకు తొలగించారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.