Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Chirala: ఈ ఇద్దర్ని అలలు మింగేశాయ్ – పాపం 2 కుటుంబాల్లో విషాదం

29 June 2025

Dog Vs Cat: కుక్క VS పిల్లి.. విశ్వాసం.. తెలివితేటల రేసులో ఏది ముందో తెలుసా?

29 June 2025

Cockroach In Srisailam Laddu,శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక.. శివ.. శివా! – srisailam laddu prasadam cockroach incident goes viral

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Thalliki Vandanam Scheme 2025,తల్లికి వందనం డబ్బులు పడ్డాయా.. ఇలా తప్పక చేయండి! – thalliki vandanam scheme ap government conduct thank you cm sir survey from beneficiaries
ఆంధ్రప్రదేశ్

Thalliki Vandanam Scheme 2025,తల్లికి వందనం డబ్బులు పడ్డాయా.. ఇలా తప్పక చేయండి! – thalliki vandanam scheme ap government conduct thank you cm sir survey from beneficiaries

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Thalliki Vandanam Scheme 2025,తల్లికి వందనం డబ్బులు పడ్డాయా.. ఇలా తప్పక చేయండి! – thalliki vandanam scheme ap government conduct thank you cm sir survey from beneficiaries
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు ఇటీవల విడుదల చేసింది. మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.13000 చొప్పున విడుదల చేసింది. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ మొత్తం డబ్బులు విడుదల చేశారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేశారు. అయితే తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన వారి కోసం ఇప్పుడు మరో సర్వే చేస్తున్నారు. థ్యాంక్యూ సీఎం సార్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వే చేస్తు్న్నారు.

తల్లికి వందనం డబ్బులు పడ్డాయా.. ఇలా తప్పక చేయండి!
తల్లికి వందనం డబ్బులు పడ్డాయా.. ఇలా తప్పక చేయండి! (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా తల్లికి వందనం పథకం నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద రూ.13000 అందజేసింది. మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద సాయం అందించింది. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ మొత్తం జమ చేసింది. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ అకౌంట్లో జమ అయిన డబ్బులను ఇప్పటికే తల్లులు అందరూ డ్రా చేసి.. విద్యార్థుల అవసరాల కోసం వెచ్చిస్తున్నారు.

అయితే తల్లికి వందనం పథకం డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవటం మాత్రమే కాదు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు మరో పని చేయాల్సి ఉంటుంది. తల్లికి వందనం పథకం కింద రూ.13000 వచ్చినట్లు ఏపీ ప్రభుత్వానికి ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. తల్లికి వందనం నిధులు విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం థ్యాంక్యూ సీఎం సార్ అంటూ సర్వే మొదలుపెట్టింది. థ్యాంక్యూ సీఎం సార్ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది. గ్రామాలను సందర్శిస్తారు. తల్లికి వందనం లబ్ధిదారుల ఇంటికి వచ్చి.. డబ్బులు జమ అయ్యాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఫేస్, ఐరిస్, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ వివరాలను నమోదు చేస్తారు.
అయితే థ్యాంక్యూ సీఎం సార్ సర్వేలో పాల్గొనడం ద్వారా లబ్ధిదారులకు తల్లికి వందనం డబ్బులు అందాయని ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. దీనివలన తదుపరి విడత డబ్బులు జమ చేయటంలో జాప్యం జరిగే అవకాశాలు ఉండవని సమాచారం.

తల్లికి వందనం డబ్బులు పడ్డాయా.. ఇలా తప్పక చేయండి!

థ్యాంక్యూ సీఎం సర్ సర్వే కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మొబైల్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నారు. అలాగే బ్ధిదారుడి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా వివరాలను యాప్‌లో చూసి, ధృవీకరణ చేస్తున్నారు. ధృవీకరణ పూర్తయితే తల్లికి వందనం డబ్బులు జమైనట్లు ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఏపీలో పలుచోట్ల ఈ థ్యాంక్యూ సీఎం సర్ సర్వే జరుగుతోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి