Sajjanar Requests Ap Cm On Tirumala Darshan Tickets: తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చంద్రబాబుకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. టీటీడీ శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తెలంగాణ ఆర్టీసీ, పర్యాటక శాఖకు కేటాయించాలని కోరారు. ఆరు నెలల క్రితం టీటీడీ ఈ టికెట్ల జారీని నిలిపివేసింది. మరోవైపు, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుపతిలోని శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పరిణామాల వెనుక ఆంతర్యం ఏమిటి?
హైలైట్:
- ఏపీ సీఎం చంద్రబాబుకు సజ్జనార్ రిక్వెస్ట్
- ఆరు నెలలుగా ఆగిపోయిన దర్శన టికెట్లు
- మళ్లీ ప్రారంభించాలని కోరిన TS ఆర్టీసీ ఎండీ

తిరుపతిలోని శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించిన టీటీడీ ఛైర్మన్
తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీ శక్తిపీఠం శ్రీ పాతాళ శ్వేత వారాహీ క్షేత్రంలో శ్రీ వారాహీ నవరాత్రులు సందర్భముగా శ్రీ శ్రీ శ్రీ అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మరకత శక్తి కాళీదేవి, శ్రీ మరకత సిద్దేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ శక్తి పీఠాదేశ్వరీ మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని మర్యాద పూర్వకంగా ఛైర్మన్ కలుసుకున్నారు. శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించి స్వామి వారు, మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. శ్రీ శక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ పీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదానం చాలా బాగా చేస్తున్నారని చెప్పారు.
తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్
ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు చాలా మంది వస్తున్నారని ఛైర్మన్ చెప్పారు. ప్రస్తుతం టిటిడి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీ శక్తి పీఠం నిర్వాహకులు అభినందించారని తెలిపారు.ముందుగా టిటిడి ఛైర్మన్ శ్రీ శక్తి పీఠం చేరుకోగానే నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం టిటిడి ఛైర్మన్ ను సత్కరించి వైదేహి మాలను సమర్పించారు. శ్రీ శక్తి పీఠం తరుపున పుస్తక ప్రసాదాన్ని ఛైర్మన్ కు అందించారు. అనంతరం స్వామి, అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.