Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Premanand Maharaj: మరణించిన బంధువులు కలలో కనిపిస్తే ర్ధం ఏమిటి? పరిహారం ఏమి చేయాలంటే

30 June 2025

Visakhapatnam Grandfather Child,కుమార్తెకు పుట్టిన బాబును ట్రీట్మెంట్ కోసమని తీసుకెళ్లిన తాత.. 2 నెలల తర్వాత ట్విస్ట్, పోలీసుల ఎంట్రీతో – grandfather adopts child to others without mothers knowledge in visakhapatnam

30 June 2025

India’s Space Shield: ఇకపై అంతరిక్షం నుంచే సైనిక ఆపరేషన్లు.. మరో 4 ఏళ్లలో 52 డిఫెన్స్ శాటిలైట్లు!

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Sajjanar Request AP Cm On Tirumala Darshan Tickets,తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్ – telangana rtc md vc sajjanar requests ap cm chandrababu naidu on tirumala darshan tickets
ఆంధ్రప్రదేశ్

Sajjanar Request AP Cm On Tirumala Darshan Tickets,తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్ – telangana rtc md vc sajjanar requests ap cm chandrababu naidu on tirumala darshan tickets

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Sajjanar Request AP Cm On Tirumala Darshan Tickets,తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్ – telangana rtc md vc sajjanar requests ap cm chandrababu naidu on tirumala darshan tickets
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Sajjanar Requests Ap Cm On Tirumala Darshan Tickets: తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చంద్రబాబుకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. టీటీడీ శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తెలంగాణ ఆర్టీసీ, పర్యాటక శాఖకు కేటాయించాలని కోరారు. ఆరు నెలల క్రితం టీటీడీ ఈ టికెట్ల జారీని నిలిపివేసింది. మరోవైపు, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుపతిలోని శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పరిణామాల వెనుక ఆంతర్యం ఏమిటి?

హైలైట్:

  • ఏపీ సీఎం చంద్రబాబుకు సజ్జనార్ రిక్వెస్ట్
  • ఆరు నెలలుగా ఆగిపోయిన దర్శన టికెట్లు
  • మళ్లీ ప్రారంభించాలని కోరిన TS ఆర్టీసీ ఎండీ
(ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ, పర్యాటకానికి టీటీడీ శ్రీవారి దర్శన టికెట్ల కోటా కేటాయించాలని చంద్రబాబుకు విన్నవించారు. సజ్జనార్ ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆరు నెలల క్రితం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు టికెట్ల జారీ నిలిపేసిందని తెలిపారు. ఈ దర్శన టికెట్ల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి విన్నవించామని.. టికెట్లు జారీ చేయాలని కోరారు. ఈ విషయంపై టీటీడీ అధికారులను కలిసి టికెట్లు జారీ చేయాలని కోరుతామన్నారు సజ్జనార్. గతంలో ఆర్టీసీతో పాటుగా పర్యాటకశాఖకు టీటీడీ కొన్ని దర్శన టికెట్లు కేటాయించేది. అయితే ఆరు నెలల క్రితం టీటీడీ ఈ కోటాను ఆపేసింది.మరోవైపు తిరముల శ్రీవారిని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయం దగ్గరకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుపతిలోని శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించిన టీటీడీ ఛైర్మన్

తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీ శక్తిపీఠం శ్రీ పాతాళ శ్వేత వారాహీ క్షేత్రంలో శ్రీ వారాహీ నవరాత్రులు సందర్భముగా శ్రీ శ్రీ శ్రీ అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మరకత శక్తి కాళీదేవి, శ్రీ మరకత సిద్దేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ శక్తి పీఠాదేశ్వరీ మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని మర్యాద పూర్వకంగా ఛైర్మన్ కలుసుకున్నారు. శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించి స్వామి వారు, మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. శ్రీ శక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ పీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదానం చాలా బాగా చేస్తున్నారని చెప్పారు.

తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్

ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు చాలా మంది వస్తున్నారని ఛైర్మన్ చెప్పారు. ప్రస్తుతం టిటిడి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీ శక్తి పీఠం నిర్వాహకులు అభినందించారని తెలిపారు.ముందుగా టిటిడి ఛైర్మన్ శ్రీ శక్తి పీఠం చేరుకోగానే నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం టిటిడి ఛైర్మన్ ను సత్కరించి వైదేహి మాలను సమర్పించారు. శ్రీ శక్తి పీఠం తరుపున పుస్తక ప్రసాదాన్ని ఛైర్మన్ కు అందించారు. అనంతరం స్వామి, అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి