Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Krithi Shetty: గ్లామర్ ఫోజులతో మతిపోగొడుతున్న బేబమ్మ.. అయినా పట్టించుకోని టాలీవుడ్..

30 June 2025

Premanand Maharaj: మరణించిన బంధువులు కలలో కనిపిస్తే ర్ధం ఏమిటి? పరిహారం ఏమి చేయాలంటే

30 June 2025

Visakhapatnam Grandfather Child,కుమార్తెకు పుట్టిన బాబును ట్రీట్మెంట్ కోసమని తీసుకెళ్లిన తాత.. 2 నెలల తర్వాత ట్విస్ట్, పోలీసుల ఎంట్రీతో – grandfather adopts child to others without mothers knowledge in visakhapatnam

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Devarapalli Khammam National Highway 365bg,ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో విశాఖపట్నం త్వరగా వెళ్లొచ్చు, టోల్ ఫీజ్‌పై కీలక నిర్ణయం – devarapalli khammam national highway 365bg toll fees key decision
ఆంధ్రప్రదేశ్

Devarapalli Khammam National Highway 365bg,ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో విశాఖపట్నం త్వరగా వెళ్లొచ్చు, టోల్ ఫీజ్‌పై కీలక నిర్ణయం – devarapalli khammam national highway 365bg toll fees key decision

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Devarapalli Khammam National Highway 365bg,ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో విశాఖపట్నం త్వరగా వెళ్లొచ్చు, టోల్ ఫీజ్‌పై కీలక నిర్ణయం – devarapalli khammam national highway 365bg toll fees key decision
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Khammam Devarapalli National Highway 365BG: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో నేషనల్ హైవే ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. దేవరపల్లి-ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ నూతన హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గుతుంది. ప్రయాణించిన దూరం మేరకే టోల్ ఛార్జీ వసూలు చేసే విధానంతో ఈ ఏడాది చివరి నాటికి రహదారిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆటోలు, బైక్‌లకు అనుమతి లేదు.

హైలైట్:

  • తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త హైవే
  • టోల్ ఫీజులపై కీలకమైన నిర్ణయం
  • ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్
దేవరపల్లి ఖమ్మం నేషనల్ హైవే
దేవరపల్లి ఖమ్మం నేషనల్ హైవే (ఫోటోలు– Samayam Telugu)

తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త నేషనల్ హైవే ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు దేవరపల్లి-ఖమ్మం మధ్య హైవే పనులు ముగింపు దశకు వచ్చాయి. తాజాగా ఈ హైవేకు సంబంధించి.. ఎంత దూరం వెళ్తే అంత టోల్ కట్టే విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దీని నిర్మాణం పూర్తిచేసి వాహనాలను అనుమతించనున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి ఈ హైవే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొత్త హైవేతో ద్వారా రెండు గంటల సమయం ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ దేవరపల్లి-ఖమ్మం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో టోల్ వసూలు చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. వానదారులు ఎంత దూరం ప్రయాణిస్తే.. అంతే టోల్ కట్టాలి. ఈ హైవేలో 11 చోట్ల మాత్రమే ఎంటర్ కావడానికి.. బయటకు ఎగ్జిట్ కావడానికి వీలుంటుంది. అందుకే ఆ 11 చోట్ల టోల్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఏపీలో దేవరపల్లి.. తెలంగాణలోని ఖమ్మం దగ్గర టోల్‌ప్లాజాలు ఉంటాయి. వాహనదారుడు ఎక్కడ ఎంటర్ అయ్యారో టోల్‌ప్లాజా దగ్గర ఫాస్టాగ్‌ ద్వారా తెలుసుకుంటారు. బయటకు వచ్చేటప్పుడు ఎంత దూరం ప్రయాణించారో లెక్కిస్తారు.. ఆ మేరకే టోల్ ఫాస్టాగ్‌ నుంచి కట్ అవుతుంది.

ఈ నేషనల్ హైవే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా.. తెలంగాణలోని ఖమ్మం మీదుగా 162.10 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. అలాగే ఈ హైవే ఆంధ్రప్రదేశ్‌లో 56.88 కిలోమీటర్లు.. తెలంగాణలో 105.22 కిలోమీటర్లు ఉంది. ఈ హైవేకు సంబంధించి ఏపీలో ఉన్న నాలుగో ప్యాకేజీలో 98శాతం, ఐదో ప్యాకేజీలో 84శాతం పనుల్ని పూర్తి చేశారు అధికారులు. తెలంగాణలో మాత్రం 80% పనులు పూర్తయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం దగ్గర ఉన్న మున్నేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల విషయంలో ఇబ్బందులతో పనుల్లో జాప్యం జరుగుతోంది.

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో విశాఖపట్నం త్వరగా వెళ్లొచ్చు, టోల్ ఫీజ్‌పై కీలక నిర్ణయం

అలాగే ఈ హైవేకు సంబంధించిన భూసేకరణ వ్యవహారం కోర్టులకు చేరడంతో అలా కూడా ఆలస్యమైంది. ఆ భూముల వ్యవహారంలో కూడా కోర్టులో కేసులు ఓ కొలిక్కి రాడంతో మిగిలిన పనుల్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ హైవే అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేషనల్ హైవేపై వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. అంతేకాదు ఈ హైవేలోకి ఆటోలు, ట్రాక్టర్లు, బైక్‌లకు ఎంట్రీ లేదు.. వీరు పాత హైవే మీదుగా వెళ్లొచ్చు. కేవలం లారీలు, బస్సులు, కార్లు, ఇతర భారీ వాహనాలకు మాత్రం ఎంట్రీ ఉంటుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి