Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Evil Eye: ఈ రాశుల వారికి నరదిష్టి ఎక్కువ.. ఏ రాశి వారు ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసా?

30 June 2025

Vajrasana Benefits: అన్నం తిన్నాక వజ్రాసనం వేస్తే ఈ సమస్యలన్నీ మాయం.. యోగా మంత్రమిదే!

30 June 2025

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. సినిమాలు మానేసి ఇప్పుడు సాఫ్ట్‏వేర్ జాబ్ చేస్తోన్న బ్యూటీ.. ఇప్పుడేలా ఉంటే..

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ntr Bharosa Pension Scheme In Eligibility,ఏపీలో వారందరి పింఛన్‌లు కట్.. అమ్మో అంతమంది ఉన్నారా, లెక్క తేలినట్లే! – ntr bharosa pension scheme number of ineligible people receiving disability pensions has reached one lakh reports
ఆంధ్రప్రదేశ్

Ntr Bharosa Pension Scheme In Eligibility,ఏపీలో వారందరి పింఛన్‌లు కట్.. అమ్మో అంతమంది ఉన్నారా, లెక్క తేలినట్లే! – ntr bharosa pension scheme number of ineligible people receiving disability pensions has reached one lakh reports

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ntr Bharosa Pension Scheme In Eligibility,ఏపీలో వారందరి పింఛన్‌లు కట్.. అమ్మో అంతమంది ఉన్నారా, లెక్క తేలినట్లే! – ntr bharosa pension scheme number of ineligible people receiving disability pensions has reached one lakh reports
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ntr Bharosa Pension Scheme In Eligible Persons: దివ్యాంగుల పింఛన్లలో అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులు అక్రమంగా సర్టిఫికెట్లు పొందినట్లు గుర్తించారు. ఇప్పటివరకు లక్ష మంది అనర్హులను గుర్తించి పింఛను నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దళారులు, వైద్యులు కుమ్మక్కై ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలకు హాజరుకాని వారిలోనూ అనర్హులు తేలారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

హైలైట్:

  • ఏపీలో పింఛన్లపై కీలక నిర్ణయం
  • అనర్హులు అక్రమంగా సర్టిఫికెట్లు
  • అనర్హులపై త్వరలోనే నిర్ణయం
ఏపీ పింఛన్ అనర్హులపై వేటు
ఏపీ పింఛన్ అనర్హులపై వేటు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పింఛన్‌ల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లలో అక్రమాలు జరిగాయని గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు అక్రమంగా సర్టిఫికెట్లు పొందారని ఆరోపణలు వచ్చాయి.. ఈ మేరకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐదారు నెలలుగా అనర్హులను గుర్తించి పింఛన్లు తొలగించే ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు చేపట్టిన తనిఖీల్లో.. ఇప్పటివరకు లక్ష మంది అనర్హులను గుర్తించారు.. వారికి పింఛను ఆపే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.గత ప్రభుత్వంలో కొందరు దళారులు, వైద్యులు కుమ్మక్కయ్యారనే విమర్శలు వచ్చాయి. దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల వచ్చాయి. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ పింఛన్ల కోటాలో వినికిడి లోపంతో పాటుగా మానసికంగా సమస్యలు (ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు) ఉన్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించారని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.6 వేల చొప్పున 7.86 లక్షల మంది దివ్యాంగులకు పింఛను పంపిణీ చేస్తున్నారు. అయితే వీరిలో చాలామందికి పరీక్షలు నిర్వహించారు.. అయితే చాలామంది ఈ పరీక్షలకు రాకుండా దూరంగా ఉన్నారు.. అయితే వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా తేలారట.

ముఖ్యంగా దివ్యాంగులు, ఆరోగ్య పరమైన సమస్యలున్న వారి కోటాలో రూ.6 వేలు, రూ.15 వేల పింఛన్లు తీసుకునే వారు ఉన్నారు. వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని ఆరోపణలు రాగా.. వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆరోగ్యశాఖ, సెర్ప్ అధికారుల ఆధ్వర్యంలో దివ్యాంగుల కోటాలో పింఛన్‌లు పొందుతున్నవారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల మందికి పరీక్షలు చేయించుకోవాలని సమాచారం ఇవ్వగా.. వీరిలో 50 వేల మంది అసలు పరీక్షలు చేయించుకోవడానికి రాలేదు. మిగిలిన వారిలో దాదాపు 3 లక్షల మందికి వైకల్యాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ‘మిగిలిన వారిలో 60 వేల మందికి 40% కంటే తక్కువ వైకల్యం.. మరో 40 వేల మందికి వైకల్యం ఉన్నా కోలుకునే అవకాశం ఉంది’ అని తేలిందట. నవంబర్ వరకు ఈ పరీక్షలు జరుగతాయంటున్నారు.

ఏపీలో వారందరి పింఛన్‌లు కట్.. అమ్మో అంతమంది ఉన్నారా, లెక్క తేలినట్లే!

ఏపీ వ్యాప్తంగా చూస్తే.. విజయనగరం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువమంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీకాకుళం, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఎక్కువమంది అక్రమంగా సర్టిఫికెట్లు పొందారని గుర్తించారు. ప్రతి నెలా రూ.15 వేల పింఛను తీసుకునేవారు మొత్తం 24 వేల మంది ఉంటే.. వారిలో 23,763 మందికి పరీక్షలు చేయగా 13 వేల మంది అనర్హులుగా గుర్తించారు. అయితే వీరి పింఛన్ విషయంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతానికి వారి పింఛను ఆపే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రూ.6 వేల పింఛను తీసుకునే వారు 7.86 లక్షల మంది ఉంటే.. పరీక్షలకు పిలిచిన వారి సంఖ్య 4.50 లక్షలు కాగా.. హాజరు కాని వారు 50 వేలమంది ఉన్నారు. వైకల్య సమస్య ఉన్నవారు 2 లక్షల మంది కాగా.. అనర్హులు లక్ష మంది అని తేలింది.. వీరికి పింఛన్ కట్ చేసే అవకాశం ఉంది.. దీనిపై త్వరలో ఓ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి