Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Smart Parenting: పిల్లలు తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలంటే.. ఈ అలవాట్లు నేర్పించాల్సిందే..!

30 June 2025

July 2025 Horoscope: అనేక మార్గాల్లో వారి ఆదాయం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి మాసఫలాలు

30 June 2025

BRAOU Admissions 2025: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. కోర్సుల వారీగా ఫీజుల ఇవే

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kurabalakota Accident,తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ముగ్గురు బలి – road accident near kurabalakota annamayya district
ఆంధ్రప్రదేశ్

Kurabalakota Accident,తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ముగ్గురు బలి – road accident near kurabalakota annamayya district

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kurabalakota Accident,తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ముగ్గురు బలి – road accident near kurabalakota annamayya district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Annamayya District Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కురబలకోట మండలం వద్ద టెంపోను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. బాధితులు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు తిరుమలలో జీఎన్సీ టోల్‌గేట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

హైలైట్:

  • అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ముగ్గురు అక్కడే మృతి.. 11మందికి గాయాలు
  • చనిపోయిన వారు కర్ణాటకవాసులుగా గుర్తింపు
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం (ఫోటోలు– Samayam Telugu)

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట దగ్గర టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనలో ముగ్గురు అక్కడే చనిపోగా.. 11 మందికి గాయాలయ్యాయి.. వీరిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయినవారు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శించుకుని సొంత ఊరికి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టెంపోను ఢీకొన్న వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం పంపారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి తిరిగొస్తుండగా ఇలా ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విషాదంగా మారింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ముగ్గురు బలి

మరోవైపు తిరుమలలో కారు మంటల్లో కాలిపోయింది. ఆదివారం కొండపై జీఎన్సీ టోల్‌గేట్‌ దగ్గర ఓ కారులో మంటలు వ్యాపించాయి. కర్ణాటక కోలార్‌ జిల్లా గుడిపల్లికి చెందిన సుదర్శన్‌ తిరుమల శ్రీవారి దర్శనం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని జీఎన్సీ టోల్‌గేట్‌ దగ్గరకు రాగానే.. ఒక్కసారిగా కారు ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే గమనించిన సుదర్శన్ కుటుంబసభ్యుల్ని అలర్ట్ చేసి.. అందరూ వాహనం నుంచి కిందకు దిగారు. అక్కడి నుంచి వారంతా దూరంగా పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే కారులో నుంచి మంటలు వ్యాపించాయి. వెంటనే టీటీడీ విజిలెన్స్‌, ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటలు ఆర్పిన సమయానికే కారు సగం కాలిపోయింది. అయితే కారు ఇంజిన్‌లో లోపం కారణంగా మంటలు చెలరేగాయా.. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి