Annamayya District Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కురబలకోట మండలం వద్ద టెంపోను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. బాధితులు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు తిరుమలలో జీఎన్సీ టోల్గేట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
హైలైట్:
- అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- ముగ్గురు అక్కడే మృతి.. 11మందికి గాయాలు
- చనిపోయిన వారు కర్ణాటకవాసులుగా గుర్తింపు

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ముగ్గురు బలి
మరోవైపు తిరుమలలో కారు మంటల్లో కాలిపోయింది. ఆదివారం కొండపై జీఎన్సీ టోల్గేట్ దగ్గర ఓ కారులో మంటలు వ్యాపించాయి. కర్ణాటక కోలార్ జిల్లా గుడిపల్లికి చెందిన సుదర్శన్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ దగ్గరకు రాగానే.. ఒక్కసారిగా కారు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే గమనించిన సుదర్శన్ కుటుంబసభ్యుల్ని అలర్ట్ చేసి.. అందరూ వాహనం నుంచి కిందకు దిగారు. అక్కడి నుంచి వారంతా దూరంగా పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే కారులో నుంచి మంటలు వ్యాపించాయి. వెంటనే టీటీడీ విజిలెన్స్, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటలు ఆర్పిన సమయానికే కారు సగం కాలిపోయింది. అయితే కారు ఇంజిన్లో లోపం కారణంగా మంటలు చెలరేగాయా.. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.