Andhra Pradesh Bjp President,ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి.. రేసులో మాజీ ఎమ్మెల్సీతో పాటుగా మాజీ సీఎం పేర్లు – all set for andhra pradesh bjp president election
Andhra Pradesh Bjp President Election: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. 119 మంది ఓటర్లతో రాష్ట్ర పార్టీ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. మాజీ ఎమ్మెల్యే మాధవ్, నల్లారి కిరణ్కుమార్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మంగళవారం ఫలితం వెల్లడికానుంది. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కూడా జరుగుతుంది. గతంలో పురందేశ్వరి టీడీపీ, జనసేనతో పొత్తులో కీలక పాత్ర పోషించారు. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
హైలైట్:
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు
ఇవాళ నామినేషన్ల సహా మిగిలిన ప్రక్రియ
మంగళవారం కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటన
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ జరగనుంది. రాష్ట్ర పార్టీ కార్యాలయం అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయగా.. ఓటింగ్ అర్హత కలిగినవారు 119 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన పరిశీలకులుగా కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ వ్యవహరిస్తారని బీజేపీ తెలిపింది. ఇవాళ నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. అయితే భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఒకరే నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది అంటున్నారు. అయితే మంగళవారం అధ్యక్ష పదవి ఎన్నిక ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుల కోసం కూడా ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితాను విజయవాడలో ఉన్న రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మాధవ్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుల పేర్లు కూడా రేసులో ఉన్నాయంటున్నారు. మరి అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ పగ్గాలను చేపట్టారు.. ఏపీలో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసే పార్టీలతో కలిసి ఘన విజయం సాధించారు. పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆమెను అధ్యక్ష పదవిలో కొనసాగిస్తారనే టాక్ వినిపించింది.. కానీ అధిష్టానం మార్పు ఖాయమని సంకేతాలు ఇచ్చింది.
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి.. రేసులో మాజీ ఎమ్మెల్సీతో పాటుగా మాజీ సీఎం పేర్లు
ఇటు తెలంగాణలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల జరగనుంది. తుది రేసులో మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అక్కడ కూడా ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది.. మంగళవారం కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి