Andhra Pradesh Diet Charges Increase Proposal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. అంతేకాకుండా హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. డైట్ ఛార్జీలు పెరిగితే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్లో డైట్ ఛార్జీల పెంపు
- మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు చేశారు
- త్వరలోనే నిర్ణయం ఉంటుందని

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ హాస్టల్స్తో పాటుగా రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ వంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు డైట్ ఛార్జీలు అందిస్తుంది. అలాగే విద్యార్థినిలకు కాస్మోటిక్ ఛార్జీలు కూడా చెల్లిస్తారు. ఈ ఛార్జీలను నెలవారీగా వారికి అందజేస్తారు. ఈ మేరకు 2023-2024కు సంబందించి ఛార్జీలను పెంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం కూడా డైట్ ఛార్జీలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి సవిత ఇప్పటికే ఛార్జీల పెంపు విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు.. త్వరలోనే పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం ఇటీవల కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు డైట్ ఛార్జీల పెంపు వంతు వచ్చింది.