మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఐదు రూపాయల చాక్లెట్ కొనివ్వమని అడిగినందుకు నాలుగేళ్ల కుమార్తె గొంతు కోసి చంపేశాడో తాగుబోతు తండ్రి. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. నిందితుడు బాలాజీ రాథోడ్గా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం…
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన రాథోడ్ మద్యానికి బానిసయ్యాడు. తాగుడు అలవాటుతో తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవని తెలిసింది. వేధింపులు భరించలేక అతని భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అదే ఊర్లో ఉంటున్న తన తండ్రితో కలిసి అక్కడే జీవిస్తుంది. ఈ క్రమంలోనే తండ్రిని చూసిన రాథోడ్ కుమార్తె ఆరుషి చాక్లెట్లు కొనడానికి డబ్బు అడిగింది. దీంతో ఆగ్రహించిన అతను ఆమెను గొంతు కోసి చంపినట్టుగా తెలిసిందన్నారు.. రాథోడ్ భార్య వర్ష తన భర్తకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. నిందితుడు లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ తాలూకాలోని భీమా తండా నివాసి. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి సంఘటనే జరిగింది. స్వరూప్ నగర్లో తన స్నేహితుడి ఏడేళ్ల కుమార్తెను హత్య చేసిన కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. సంఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతను తన స్నేహితుడి ఇంట్లో ఆ అమ్మాయితో ఒంటరిగా ఉన్నాడు. టీవీ చూస్తున్నాడు. ఆ అమ్మాయి రిమోట్ ఇవ్వమని అడిగినందుకు అతను చిరాకుపడి ఆమెను బలంగా చెంపదెబ్బ కొట్టాడు. దీంతో చిన్నారి కిందపడి రక్తస్రావం అయింది. ఈ విషయం ఎక్కడ బయట చెబుతుందోనన భయంతో, అతను ఆమెను గొంతు కోసి చంపాడని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..