Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG: భారత్‌తో రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. హమ్మయ్యా.. ఆ పేస్ పిచ్చోడు ఆడడం లేదులే

30 June 2025

ఇదెక్కడి ఘోరం.. ఇద్దరు భార్యలుండగా మూడో పెళ్లి..! రెండో భార్యతో కలిసి మూడో భార్యను అతి కిరాతకంగా..

30 June 2025

వందేళ్ల ఆయుష్షుకు బటర్ ఫ్రూట్.. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో తీసుకున్నారంటే సర్వరోగాలు మటాష్!

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tiruchanur Two Dead Bodies Found In Car,కారులో ఇద్దరు యువకుల మృతదేహాల కలకలం.. ఆ చిన్న పొరపాటుతో ప్రాణాలు పోయాయా? – two dead bodies found in a car at tiruchanur tirupati
ఆంధ్రప్రదేశ్

Tiruchanur Two Dead Bodies Found In Car,కారులో ఇద్దరు యువకుల మృతదేహాల కలకలం.. ఆ చిన్న పొరపాటుతో ప్రాణాలు పోయాయా? – two dead bodies found in a car at tiruchanur tirupati

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tiruchanur Two Dead Bodies Found In Car,కారులో ఇద్దరు యువకుల మృతదేహాల కలకలం.. ఆ చిన్న పొరపాటుతో ప్రాణాలు పోయాయా? – two dead bodies found in a car at tiruchanur tirupati
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tiruchanur Car Dead Bodies Found: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో కారులో ఇద్దరు యువకులు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. రంగనాథం వీధిలో పార్క్ చేసిన కారులో వినయ్, దిలీప్ మృతదేహాలను గుర్తించారు. పోలీసులు బీర్ బాటిల్స్ ఆధారంగా ఊపిరాడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారుపై కవర్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

హైలైట్:

  • తిరుచానూరులో మృతదేహాల కలకలం
  • కారులో ఇద్దరు యువకుల డెడ్‌బాడీలు
  • ఆ చిన్న పొరపాటు వల్లే చనిపోయారా?
తిరుచానూరు యువకుల మృతదేహాలు
తిరుచానూరు యువకుల మృతదేహాలు (ఫోటోలు– Samayam Telugu)

తిరుపతి సమీపంలోని తిరుచానూరు లో కారులో మృతదేహాలు బయటపడిన ఘటన కలకలం రేపింది. తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంది.. ఇవాళ ఉదయం కొందరు స్థానికులు కారును గమనించారు. అక్కడ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో దగ్గరకు వెళ్లి చూశారు.. లోపల ఇద్దరు యువకుల మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని కారు డోర్ ఓపెన్ చేసి ఇద్దరు యువకులు మృతదేహాలను బయటకు తీశారు. కారులో ప్రాణాలు
కోల్పోయిన యువకుల్ని తిరుచానూరుకు చెందిన వినయ్, దీలీప్‌గా గుర్తించారు.. వారిద్దరు అన్నదమ్ములని సమాచారం. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కారులో నాలుగు బీర్ బాటిల్స్‌ను గుర్తించారు.. ఈ ఇద్దరు యువకులు బీర్లు తాగిన మత్తులో కారులో ఏసీ వేసుకుని పడుకున్నట్లు భావిస్తున్నారు. ఇలా కారులో నిద్రిస్తున్న క్రమంలో.. కారులో పెట్రోల్ మొత్తం ఖాళీ కావడంతో.. ఇంజన్ ఆగిపోయి ఉంటుందని.. ఇద్దరు యువకులకు ఊపిరాడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. యువకుల మృతిపై స్థానికులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారులోపల యువకుల మృతదేహాలు ఉంటే.. కారు బయట నుంచి పూర్తిగా కవర్ కప్పి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. యువకులు కారులో ఉండి మద్యం సేవించి పడుకున్నప్పటికీ.. బయట నుంచి కవర్ ఎవరు కప్పి ఉంటారన్నది ఇప్పుడు అందరి మొదళ్లను తొలిచేస్తున్న అనుమానం.

ఆదివారం కాబట్టి.. ఎవరైనా చూస్తారేమో అని వాళ్లే బయట కవర్ కప్పుకుని లోపలికి వెళ్లి మద్యం సేవించి అందులోనే పడుకున్నారా.. లేదా ఎవరైనా కావాలనే యువకులను ప్లాన్ చేసి చనిపోయేలా చేశారా..? అనుకోకుండా మద్యం మత్తులో అందులో ఇరుక్కుపోయి వాళ్లే ప్రాణాలు కోల్పోయారా.. అలా కోల్పోతే బయటి నుంచి ఎవరు కవర్ కప్పి ఉంటారు.. అన్న అనుమానాలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ అనుమానాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉంది.. దీంతో పోలీసులు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఒకవేళ యువకులు కారులో ఇరుక్కుపోయి ఉంటే బయటకు వచ్చేందుకు ప్రయత్నించారా లేదా అనేది క్లారిటీ లేదు. కారులో యువకుల్ని ఎవరూ గుర్తించలేకపోయారా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుచానూరు తిరుమల కొండకు దిగువన తిరుపతికి దగ్గరలో ఉంటుంది. తిరుచానూరులో పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు.. అలాంటి చోట ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

కారులో ఇద్దరు యువకుల మృతదేహాల కలకలం.. ఆ చిన్న పొరపాటుతో ప్రాణాలు పోయాయా?

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ముగ్గురు బలి. తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు.. టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ.. అబ్బో దొంగలకు దైవ భక్తి ఎక్కువే.. పోలీసులు అవాక్కు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి