Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG: భారత్‌తో రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. హమ్మయ్యా.. ఆ పేస్ పిచ్చోడు ఆడడం లేదులే

30 June 2025

ఇదెక్కడి ఘోరం.. ఇద్దరు భార్యలుండగా మూడో పెళ్లి..! రెండో భార్యతో కలిసి మూడో భార్యను అతి కిరాతకంగా..

30 June 2025

వందేళ్ల ఆయుష్షుకు బటర్ ఫ్రూట్.. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో తీసుకున్నారంటే సర్వరోగాలు మటాష్!

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Devotees Tirupati Police Alert,తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. పోలీసుల కీలక సూచనలు – tirupati police alert devotees who came to tirumala darshan in own vehicles
ఆంధ్రప్రదేశ్

Tirumala Devotees Tirupati Police Alert,తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. పోలీసుల కీలక సూచనలు – tirupati police alert devotees who came to tirumala darshan in own vehicles

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Devotees Tirupati Police Alert,తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. పోలీసుల కీలక సూచనలు – tirupati police alert devotees who came to tirumala darshan in own vehicles
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirupati Police Alert Tirumala Devotees: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతి పోలీసులు ముఖ్యమైన సూచనలు చేశారు. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు తిరుపతిలో కనీసం రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనివల్ల వాహనాల ఇంజన్ వేడి తగ్గుతుంది, డ్రైవర్లకు నిద్ర మత్తు వదులుతుంది. రాత్రి దర్శనం పూర్తయితే తిరుపతిలో విశ్రాంతి తీసుకుని ఉదయం ప్రయాణం చేయడం మంచిది. ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేశారు.

హైలైట్:

  • తిరుమల వచ్చే భక్తులకు పోలీసుల అలర్ట్
  • ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
  • ఇటీవల ఘటనలతో భక్తుల్ని అలర్ట్ చేశారు
తిరుమల భక్తులకు పోలీసుల హెచ్చరిక
తిరుమల భక్తులకు పోలీసుల హెచ్చరిక (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ముఖ్యమైన గమనిక.. తిరుపతి జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు. దర్శనం కోసం సొంత వాహనాల్లో వచ్చే భక్తుల్ని అలర్ట్ చేశారు.. ఈ మేరకు తిరుపతి జిల్లా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రత తిరుపతి పోలీసు వారి బాధ్యత అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు.. స్వామివారిని దర్శించుకుని సొంత ఊర్లకు వెళ్లేవారికి విజ్ఞప్తి చేశారు. ‘దేశం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు.. తిరిగి ప్రయాణం అవుతున్న భక్తులకు గమనిక. తమ తమ వాహనాల్లో తిరుమలకు వస్తున్న భక్తులు తిరుపతిలో రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే తిరుమలకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాము. సొంత వాహనాలలో ప్రయాణం చేసి వస్తున్న భక్తులతో పాటు వాహనాలకు కూడా విరామం దొరికితే, కార్ల ఇంజన్ చల్లబడుతుంది. అలా చేయడం వల్ల కార్లు ఇంజన్ చల్లబడి ఇంజన్ హీట్ కలిగే అవకాశం తగ్గుతుంది. దీంతో పాటు వాహనాలు నడుపుతున్న వ్యక్తులకు నిద్రమత్తు కూడా వదులుతుందని మనవి చేస్తున్నాము. ఇలా చేయడం వల్లన ప్రమాదాలను కొంతవరకు నివారించొచ్చు’ అని సూచించారు.

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. పోలీసుల కీలక సూచనలు

ఒకవేళ ఎవరైనా భక్తులకు రాత్రి సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం పూర్తైతే.. వారు తిరుపతిలో ఆగి విశ్రాంతి తీసుకోవాలని పోలీసులు కోరారు. రాత్రి వేళల్లో శ్రీవారి దర్శనం పూర్తికాగానే.. త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందర వద్దన్నారు. నిద్రమత్తులో వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఇటీవల కాలంలో కొందరు భక్తులు ఇలా నిద్రమత్తులో హడావిడిగా వెళ్లి రోడ్డు ప్రమాదాలబారిన పడ్డారని గుర్తు చేశారు. భక్తులు నిదానంగా సురక్షితంగా వెళ్లాలని సూచించారు. తిరుమలకు వచ్చే వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు. తిరుమలలో ఆదివారం కర్ణాటకకు చెందిన భక్తుల కారులో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భక్తుల్ని పోలీసులు అలర్ట్ చేశారు. సో తిరుమలకు వచ్చే భక్తులు ఈ సూచనలు పాటించండి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి