Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు

30 June 2025

Dil Raju: 30 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నా.. నా బయోపిక్‌కు ఆ హీరో అయితే బాగుంటాడు: దిల్ రాజు

30 June 2025

కుప్పకూలిన బంగారు గని, 11 మంది మృతి

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Permit Rooms At Ap Liquor Shops,ఏపీలోని మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్! – andhra pradesh excise department government to start permit room at liquor shops
ఆంధ్రప్రదేశ్

Permit Rooms At Ap Liquor Shops,ఏపీలోని మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్! – andhra pradesh excise department government to start permit room at liquor shops

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Permit Rooms At Ap Liquor Shops,ఏపీలోని మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్! – andhra pradesh excise department government to start permit room at liquor shops
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Liquor Shops: ఆంధ్రప్రదేశ్ లోని మందుబాబులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. రాష్ట్ర ఖజానా ఆదాయం పెంచేందుకు ఎక్సైజ్ శాఖ పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుపై దృష్టి సారించింది. గతంలో రద్దు చేసిన ఈ విధానాన్ని తిరిగి తీసుకురావడం ద్వారా సుమారు రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.7.5 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.5 లక్షలుగా ఫీజు నిర్ణయించనున్నారు. దీనివల్ల బహిరంగంగా మద్యం సేవించడం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపు (ఫోటోలు– Samayam Telugu)

ఏపీలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానా ఆదాయం పెంచటంపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఎక్సైజ్ పాలసీని ఎన్డీఏ కూటమి సర్కారు రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2024 అక్టోబర్ నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. గతంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించగా.. ఈసారి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. నూతన మద్యం విధానం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరింది.

లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తుల ద్వారానే సుమారుగా 1900 కోట్లు ఆదాయం సమకూరింది. అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీ కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు సుమారుగా రూ.28 వేల కోట్లు ఆదాయం వచ్చిందని అంచనా. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులు ఉండవు. దీంతో దరఖాస్తు రుసుం ద్వారా సమకూరిన రూ. 1900 కోట్లు ఎలా రాబట్టాలనే దానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నుంచి ఏపీలో పర్మి్ట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వొచ్చని సమాచారం. పర్మిట్ రూమ్‌ అనుమతి కోసం గతంలో ఏడాదికి రూ.5 లక్షల రూపాయలు లిక్కర్ షాపు యజమానుల నుంచి వసూలు చేశారు.

అయితే ఈ సారి ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రణాళిక మార్చినట్లు సమాచారం. పర్మి్ట్ రూమ్‌ల అనుమతులు రెండు విభాగాలుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లిక్కర్ షాపులకు అయితే పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలు, మిగతా చోట్ల రూ. 5 లక్షలుగా ప్రతిపాదించారు. ఈ పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం ద్వారా సుమారుగా ప్రభుత్వ ఖజానాకు రూ.200 కోట్లు ఆదాయం వస్తుందని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా మద్యం దుకాణాల వద్ద మద్యం తాగేవారు.. లిక్కర్ షాపుల వద్ద కొనుగోలు చేసి అక్కడే తాగుతుంటారు. అయితే ఇలా మద్యం తాగకుండా గతంలో పర్మిట్ రూమ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పర్మిట్ రూమ్ అంటే లిక్కర్ షాపు పక్కనే ఉన్న ఓ చిన్న గది. అందులో కేవలం నిల్చొని మద్యం తాగేందుకు పర్మిషన్ ఉంటుంది. అలాగే మద్యం తాగేందుకు గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయి.

అయితే వీటిని గతంలో రద్దు చేశారు. ఇప్పుడు మరోసారి అనుమతి ఇవ్వాలనే ఆలోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉంది. వీటిని అనుమతిస్తే బహిరంగంగా మద్యం తాగే పరిస్థితి ఉండదని.. అధికారులు చెప్తున్నారు. అయితే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇస్తే లిక్కర్ షాపులు మినీ బార్లుగా మారుతాయనే భయాలు కూడా ఉన్నాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి