సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ నకు హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం తెలిపారు. అమరావతి వర్క్ షాప్-2025కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదు. దేశంలో ఓ కీలక మలుపు కానుందిని లోకేష్ అన్నారు. భవిష్యత్లో రాబోయే సాంకేతిక విప్లవానికి సీఎం చంద్రబాబు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తోందన్నారు.
-
అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం
అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మార్చాలనేది మా లక్ష్యం అని లోకేష్ తెలిపారు. ఇక్కడ ఆలోచనలు ఆవిష్కరణలుగా, ఆవిష్కరణలు పరిశ్రమలుగా మారేలా ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇది ఒకరోజు కార్యక్రమం కాదని.. ఇది దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా నిలవబోతోందని లోకేష్ తెలిపారు. క్యూబిట్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయో ఎలక్ట్రానిక్స్ వరకు, ఆల్గోరిథం అభివృద్ధి నుంచి అంతర్జాతీయ క్వాంటమ్ ప్రమాణాల వరకు మేం పూర్తిస్థాయిలో క్వాంటమ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన 156 క్యూబిట్లను కలిగిన ఐబీఎం క్యాంటమ్ సిస్టమ్-2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి రానుంది ఆయన తెలిపారు.
ఆసియాలో మొట్టమొదటి క్వాంటమ్ ప్రమాణాల టెస్ట్బెడ్ను ఎన్పీఎల్, ఐఈఈఈ, సీయాక్, ఏడబ్ల్యూఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేయడం జరుగుతుందని లోకేష్ అన్నారు. ఐబీఎం, టీసీఎస్, హెచ్ సీఎల్, టెక్ మహీంద్ర వంటి అగ్రగామి సంస్థల సహకారంతో క్యాంటమ్ స్టారప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని.. ఈ కార్యాచరణకు వ్యూహాత్మక దూరదృష్టి ఉందని తెలిపారు. ఇది ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ క్వాంటమ్ మిషన్కు అనుసంధానంగా, గ్లోబల్ భాగస్వామ్యాలతో నిర్మించడం జరుగుతుంది లోకేష్ తెలిపారు.
-
చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ
సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ. చంద్రబాబు గారు మొదటి చాప్టర్ ఐటీ అన్నప్పుడు తాను ఏడో తరగతి చదువుతున్నానని లోకేష్ తెలిపారు. దక్షిణాసియా క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది. సాఫ్ట్ వేర్ రంగానికి సిలికాన్ వ్యాలీగా అమరావతి క్యాంటమ్ వ్యాలీ అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు విజన్ సాధనకు అనుగుణంగా పనిచేస్తూ ప్రపంచపటంలో అమరావతి క్యాంటమ్కు చోటు దక్కేలా కృషిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.
-
ఏపీ బ్రెయిన్ క్యాపిటల్ గా మారుతుంది..
ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టమని.. విజన్ అంటే ఇప్పుడు వెలాసిటీ, ఇన్నోవేషన్. గ్లోబల్ రేస్ లో చేరడం కాదు.. మనమే దారిచూపడం అని లోకేష్ అన్నారు. ఫలితంగా ఏపీ బ్రెయిన్ క్యాపిటల్ గా మారుతుందని తెలిపారు. క్వాంటమ్ సైన్స్ ను ఇంజనీరింగ్ లోనూ భాగం చేస్తున్నామని తెలిపారు. అమరావతిని క్యాంటమ్ టెక్నాలజీలకు కేంద్రంగా మారుస్తామని.. ఇన్నోవేటివ్, స్టార్టప్ లకు ఈ క్యాంటమ్ వ్యాలీ పార్క్ ఓ లాంచ్ ప్యాడ్ అవుతుందన్నారు లోకేష్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.