Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ కొబ్బరి చెట్టు పిలక పాపను గుర్తుపట్టారా.? ఇప్పుడు ఆమె హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

30 June 2025

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు

30 June 2025

Dil Raju: 30 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నా.. నా బయోపిక్‌కు ఆ హీరో అయితే బాగుంటాడు: దిల్ రాజు

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Non Veg Hotel Tirumala Temple Theme,తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.. ఏందయ్యా ఇది? – non veg hotel with the theme of tirumala srivari temple controversy janasena complaint to ttd
ఆంధ్రప్రదేశ్

Non Veg Hotel Tirumala Temple Theme,తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.. ఏందయ్యా ఇది? – non veg hotel with the theme of tirumala srivari temple controversy janasena complaint to ttd

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Non Veg Hotel Tirumala Temple Theme,తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.. ఏందయ్యా ఇది? – non veg hotel with the theme of tirumala srivari temple controversy janasena complaint to ttd
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విశాఖ హైవేపై రాయుడు మిలిటరీ హోటల్‌లో తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్‌వెజ్ వడ్డిస్తుండటం వివాదాస్పదమైంది. శ్రీవారి గర్భాలయ నమూనాను ఏర్పాటు చేసి మాంసాహారం వడ్డిస్తుండటంతో హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఈవోకు జనసేన ఇంఛార్జి కిరణ్ర్ రాయల్ ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. హోటల్ యాజమాన్యం మాత్రం గర్భాలయ నమూనా ఎదురుగా వెజ్ మాత్రమే వడ్డిస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.
తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్. (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు కొలిచే దైవం. జన్మలో ఒక్కసారి అయినా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని ప్రతి హిందువూ కోరుకుంటూ ఉంటాడు. శ్రీవారి క్షణకాల దర్శనం కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తరలి వస్తుంటారు. అలాంటి పవిత్రమైన తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్‌వెజ్ హోటల్ నిర్మించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. జయ, విజయ విగ్రహాలు, బంగారు వాకిలి, కులశేఖరపడితో శ్రీవారి గర్భాలయ నమూనాతో హోటల్ నిర్మించారు. విశాఖ హైవే వద్ద రాయుడు మిలిటరీ హోటల్‌లో ఇలా శ్రీవారి గర్భాలయ నమూనా సెట్ వేశారు. అయితే శ్రీవారి గర్భాలయం నమూనా ఏర్పాటు చేసి.. మాంసాహారం వడ్డిస్తూ ఉండటంతో హిందూసంఘాలు, శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.

*తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా.. రూపాయి కట్టక్కర్లేదు.! టీటీడీ కొత్త ఆలోచన..

ఈ విషయమై తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ఈ హోటల్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇలా వ్యాపారం కోసంవ వాడుకోవటం దారుణమని కిరణ్ రాయల్ మండిపడుతున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకపోతే హోటల్ వద్ద ఆందోళన చేపడతామని కిరణ్ రాయల్ తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని.. పర్యవేక్షణ కోసం టీటీడీ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని కిరణ్ రాయల్ కోరారు.మరోవైపు తిరుమల శ్రీవారి గర్భాలయం.. ప్రతి హిందువు గుండె లోతుల్లో నిలిచే పవిత్ర స్థలమని.. అలాంటి నమూనాతో హోటల్ నిర్మించి.. ఇలా మాంసాహారం వడ్డించడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.

*తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు..

మరోవైపు శ్రీవారి భక్తుల ఆందోళనపై రాయుడు మిలిటరీ హోటల్ యాజమాన్యం స్పందించింది. తాము శ్రీవారి గర్భాలయం నమూనా ఏర్పాటు చేసినప్పటికీ.. నాన్ వెజ్ వంటకాలు వాటి ఎదురుగా వడ్డించడం లేదని తెలిపింది. శ్రీవారి గర్భాలయం నమూనా ఎదురుగా ఉన్న టేబుల్స్, పక్కనే ఉన్న టేబుళ్లపై కేవలం వెజ్ వంటకాలు మాత్రమే వడ్డిస్తున్నట్లు తెలిపింది.

తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.. ఏందయ్యా ఇది?

తిరుమలలో ఎలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో భోజనం చేస్తున్నారో.. అలాంటి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నమూనాతో హోటల్ నిర్మించినట్లు రాయుడు మిలిటరీ హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. టీటీడీకి ఫిర్యాదు చేరిన నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి