తమ తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆమె ఇద్దరు పిల్లలు దారుణంగా హత్య చేశారు. శివమొగ్గ తాలూకాలోని కుంభేశ్వర్ వీధిలో వాసు అలియాస్ వసంత్ (35) దారుణంగా హత్యకు గురయ్యారు. నిన్న (జూన్ 29) కుంభేశ్వర్ వీధి నుండి ఎకె కాలనీకి వెళ్లే వసంత్ ను ఆకాష్, హరీష్ అనే ఇద్దరు సోదరులు కత్తితో కొట్టి హత్య చేశారు. మృతుడు వసంత్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నిన్న మద్యం తాగి ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశారు. దీంతో ఆ మహిళ సవితి కుమారుడు హరీష్, సొంత కొడుకు ఆకాష్ కలిసి వసంత్ ను కొట్టి చంపారు.
నిందితుల తండ్రి మల్లెషప్పకు ఇద్దరు భార్యలు. మల్లెషప్ప, అతని మొదటి భార్య ఇద్దరూ చనిపోయారు. రెండో భార్య హత్యకు గురైన వసంత్తో వివాహేతర బంధం కలిగి ఉంది. ఆ మహిళ వయస్సులో తనకంటే పెద్దది అయినప్పటికీ వసంత్ ఆమెతో సంబంధం కొనసాగించాడు. అయితే ఆదివారం వసంత్ తాగి వచ్చి ఆ మహిళ ఇంటి ముందు కేకలు వేసి గొడవ చేశాడు. ఈ సంఘటన మొదటి భార్య కుమారుడు హరీష్, రెండవ భార్య కుమారుడు ఆకాష్ సోదరులను ఆగ్రహానికి గురిచేసింది. తల్లితో గొడవ పడిన వసంత్ను హత్య చేయడానికి వారు ఒక స్కెచ్ వేశారు. దానికి అనుగుణంగా వారు వసంత్కు ఫుల్లుగా మద్యం తాగించి నిన్న రాత్రి కుంసి పట్టణంలో దారుణంగా హత్య చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి