ఈ సరస్సు సృష్టికర్త బ్రహ్మ దేవుడి మనస్సు నుంచి పుట్టిందని ఒక మత విశ్వాసం ఉంది, అందుకే దీనిని మానస సరోవరం అని పిలుస్తారు. ఈ సరస్సులోని నీరు అత్యంత పవిత్రం. కైలాస మానస సరోవర తీర్థయాత్ర, సరస్సులో చేసే స్నానం, ఇక్కడ చేసే తపస్సుకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిలోని నీరు అమృతం లాంటిదని, దీనిలో స్నానం చేయడం అత్యంత పవిత్రం అని.. నీరు త్రాగడం ద్వారా తెలిసి తెలియక చేసిన సకల పాపాలు నశిస్తాయని చెబుతారు.