Visakhapatnam Raipur Express Highway: ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నుండి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు ఆరు గంటల్లోనే చేరుకునేలా కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే విశాఖ, విజయనగరం, పార్వతీపురం మీదుగా వెళుతుంది. ప్రస్తుతం 12 గంటలు పట్టే ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది. విశాఖ పోర్టు నుంచి సరుకులు త్వరగా చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
హైలైట్:
- ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే
- 90శాతం పనులు పూర్తి చేశారు
- విశాఖ టు రాయపూర్ 6 గంటల్లో

ఈ నేషనల్ హైవే ఏపీలో 100 కిలో మీటర్లు పొడవు.. ఒడిశాలో 241 కిలోమీటర్లు.. ఛత్తీస్గఢ్లో 125 కిలోమీటర్ల పొడవున ఉంది. మొత్తం 18 ప్యాకేజీలో ఈ హైవేను విభజించారు.. ఏపీలో అయితే 90శాతం పనులు పూర్తి చేసి ముగింపు దశకు వచ్చారు.. కానీ ఒడిశా, ఛత్తీస్గఢ్లో పనులు కొనసాగుతున్నాయి. కొన్ని భూ సమస్యల వల్ల ఏపీలో పనులు కొంత ఆలస్యం అయ్యాయి.. లేని పక్షంలో ఈపాటికి పనులు పూర్తిచేసి ఉండేవారు. మరో పది నెలల్లో ఏపీ పరిధిలోని 100 కిలోమీటర్ల హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందంటున్నారు.
ఒలింపిక్స్లో యోగా.. మోదీ తలచుకుంటే ఏదైనా సాధ్యమే: చంద్రబాబు
ఒడిశా, ఛత్తీస్గఢ్లో పనులు వచ్చే ఏడాది చివరినాటికి పూర్తవుతాయంటున్నారు. ఏపీలో ఉన్న 100 కిలోమీటర్ల హైవే కోసం రూ.3వేల కోట్లు కేటాయించారు. ఈ హైవే విశాఖపట్నం సమీపంలోని సబ్బవరం దగ్గర కోల్కత్తా-చెన్నై హైవేలో కలిసే ప్రాంతంలో టంప్రెట్ ఇంటర్ఛేంజ్ను నిర్మించారు. అంతేకాదు ఈ హైవేలోకి ఎంటర్ కావడానికి, బయటకు రావడానికి ఆరుచోట్ల అవకాశం ఉంది. ఈ హైవేలోకి ఆటోలు, బైక్లు, ట్రాక్టర్లు వంటివాటికి అనుమతి లేదు. అలాగే ఈ హైవేకు సర్వీస్ రోడ్లు కూడా ఉండవు. ఈ హైవే అందుబాటులోకి వస్తే రాయపూర్కు ఆరు గంటల్లోనే దూసుకెళ్లొచ్చు.