ఇండోనేషియాలోని బోరోబుదుర్: 9వ శతాబ్దం నాటి ఈ మహాన్ బౌద్ధ ఆలయం జావా ద్వీపంలో, యోగ్జకార్తా సమీపంలో ఉంది. 700లలో నిర్మించబడినప్పటికీ, అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా 200 నుంచి 300 సంవత్సరాల తర్వాత విస్మరించబడింది. 1800లలో బ్రిటిష్ వారు దీన్ని కనుగొని పునరుద్ధరించారు. ఈ ప్రకృతి రమణీయమైన ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు ఇండోనేషియాలో ప్రముఖ పర్యాటక ఆకర్షణ.
చిలీలోని ఈస్టర్ ద్వీపం: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని చిలీకి చెందిన ఈ ద్వీపం, మోయి అనే దిగ్గజ విగ్రహాలకు ప్రసిద్ధి. 12వ శతాబ్దం నుండి రాపానుయి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వందలాది మోయి విగ్రహాలు ద్వీపం చుట్టూ ఉన్నాయి. ప్రతి విగ్రహం ప్రత్యేకమైనది. పూర్వీకులను సూచిస్తుందని నమ్ముతారు.
చైనాలోని టెర్రకోటా ఆర్మీ: 475 BC నుంచి 221 BC వరకు కిన్ షి హువాంగ్ సమాధిని కాపాడేందుకు నిర్మించబడిన ఈ వేలాది టెర్రకోటా యోధుల విగ్రహాలు అద్భుతమైనవి. 1970లలో ఒక రైతు బావిని త్రవ్వేటప్పుడు ఇవి కనుగొనబడ్డాయి. 700,000 మంది కార్మికులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారని అంచనా.
ఈజిప్టులోని గీజా పిరమిడ్స్: ఈ ఐకానిక్ పిరమిడ్లు, స్ఫింక్స్తో పాటు, ప్రాచీన ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో మిగిలిన ఏకైక స్మారకం. పారావోల సమాధులుగా నిర్మించబడిన ఈ పిరమిడ్లు 2600 సంవత్సరాలకు పైగా పాతవి.
కంబోడియాలోని అంగోర్ వాట్: ఇది 900 AD నుంచి 1400 AD వరకు నిర్మించబడిన హిందూ-బౌద్ధ దేవాలయ సముదాయం. 162.6 హెక్టార్ల (1.6 కిమీ; 401.8 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం మొదట 1150 CEలో విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ ఆలయంగా నిర్మించబడింది. తరువాత శతాబ్దం చివరి నాటికి ఇది క్రమంగా బౌద్ధ దేవాలయంగా రూపాంతరం చెందింది. 12వ శతాబ్దంలో పురాతన ఖైమర్ను పాలించిన హిందూ రాజు సూర్యవర్మన్ II నిర్మించిన ఈ ఆలయం ఆర్కిటెక్చర్ అద్భుతం. ఈ సముదాయం చాలా పెద్దది, దీన్ని పూర్తిగా చూడడానికి రెండు రోజులు అవసరం.