Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాను మూడుసార్లు రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

2 July 2025

చోరీ చేసిన ఇంట్లోనే మకాం వేసిన దొంగోడు. మందు, విందులతో ఎంజాయ్‌..! మూడు రోజుల తరువాత..

2 July 2025

Nyepi In Bali: ఆ దేశంలో న్యూ ఇయర్ వేడుకలు వెరీ వెరీ స్పెషల్.. పూర్తిగా నిశబ్ధం.. మాట్లాడరు, బయటకు వెళ్లరు ఎందుకంటే

2 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Rains,ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – imd predicts andhra pradesh weather report that moderate rains in these districts for next three days
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Rains,ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – imd predicts andhra pradesh weather report that moderate rains in these districts for next three days

.By .2 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Rains,ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – imd predicts andhra pradesh weather report that moderate rains in these districts for next three days
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు రైతులు పంట నష్టపోయారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టారు.

హైలైట్:

  • ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్
  • అల్పపీడనం ప్రభావంతో వర్షాలు
  • ఈ జిల్లాల్లో మూడ్రోజులు వానలు
ఏపీకి రెయిన్ అలర్ట్
ఏపీకి రెయిన్ అలర్ట్ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. జార్ఖండ్‌ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోంది.. రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. అయితే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని హెచ్చరించారు. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లొద్దని సూచించారు.’ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. అయితే మంగళవారం కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. అలాగే పలు జిల్లాల్లోని తీరప్రాంతాల్లో 60 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వానలకు రైతులు పంటల్ని నష్టపోయారు.

Saraswati Sugar Mill: కొంపముంచిన వర్షం.. కరిగిపోయిన కోట్ల విలువైన చక్కెర!

ఏలూరు జిల్లా వేలేరుపాడులో 40 మిల్లీ మీటర్లు, విశాఖపట్నం జిల్లా భీమిలిలో 36.8, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 32.8, విశాఖపట్నంలో 29.6, ఏలూరు జిల్లా కుక్కునూరులో 28.4, అనకాపల్లిలో 28.4, ఏలూరు జిల్లా చింతలపూడిలో 27.2, విజయనగరంలో 22.4, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 22.2, విజయనగరం జిల్లా తెర్లాంలో 21.2, ఏలూరులో 21, ఏలూరు జిల్లా భీమడోలులో 20.6, ఏలూరు జిల్లా పోలవరంలో 20.04 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో అధికారులతో కలెక్టర్లు సమీక్షలు చేశారు. గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ముందస్తు చర్యలపై చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలపై ఫోకస్ పెట్టారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి