Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Bigg Boss : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బిగ్‏బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..

3 July 2025

TATA ACE Pro: ఏస్ ప్రో.. టాటా మోటార్స్ చరిత్రలో నవశకం: గిరీష్ వాఘ్

3 July 2025

EV Scooters: మరో నయా స్కూటర్‌ను లాంచ్ చేసిన ఏథర్.. టాప్ రేపుతున్న ఫీచర్స్ ఇవే..!

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Warns Contract Employees Strict Action,Tirumala: భక్తుల సేవలకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు.. వాటిపై నిషేధం, టీటీడీ సీరియస్ వార్నింగ్ – ttd warns strict action against disruption of tirumala devotee services
ఆంధ్రప్రదేశ్

Ttd Warns Contract Employees Strict Action,Tirumala: భక్తుల సేవలకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు.. వాటిపై నిషేధం, టీటీడీ సీరియస్ వార్నింగ్ – ttd warns strict action against disruption of tirumala devotee services

.By .3 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Warns Contract Employees Strict Action,Tirumala: భక్తుల సేవలకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు.. వాటిపై నిషేధం, టీటీడీ సీరియస్ వార్నింగ్ – ttd warns strict action against disruption of tirumala devotee services
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD Warned Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందని, సమ్మెకు దిగితే ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. విధులు బహిష్కరిస్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని.. మళ్లీ విధుల్లోకి తీసుకోమని స్పష్టం చేసింది. భక్తులకు సేవల్లో ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్విమ్స్ డైరెక్టర్ హెచ్చరించారు. సేవలకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు తప్పవంటున్నారు.

హైలైట్:

  • వారికి టీటీడీ సీరియస్ వార్నింగ్
  • కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • ఎస్మా చట్టం ప్రకారం చర్యలు
టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వార్నింగ్
టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వార్నింగ్ (ఫోటోలు– Samayam Telugu)

కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించింది టీటీడీ. తిరుమల శ్రీవారి భక్తులకు సేవలు అందించే కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను సదరు శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని కోరింది. టీటీడీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘న్యాయమైన కోర్కెలను తీర్చడానికి యాజమాన్యం సదా సంసిద్ధంగా ఉందని పేర్కొంది. పారిశుధ్ద్యం, ఆరోగ్యం తదితర శాఖలలో సంబంధిత కాంట్రాక్ట్ ఉద్యోగులు విశేషంగా సేవలు అందిస్తున్నారని, భక్తులకు ఇబ్బందులకు గురిచేసే చర్యలు తీసుకోవద్దని కోరింది. భక్తుల సేవలకు ఉద్యోగులు ఆటంకం కలిగించే చర్యలను నిషేధించే ముఖ్యమైన సేవల నిర్వహణ చట్టం ( ఎస్మా) టిటిడిలో అమలులో ఉందని, సదరు నిబంధనలను ఉద్యోగులు గుర్తు చేసుకోవాలి’ అని టీటీడీ సూచించింది.’ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక సంస్థలో విధులను బహిష్కరించడం సరికాదని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి సమ్మెబాట పడితే ఎస్మా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఎస్.ఎల్.ఎస్.ఎం.పీ.సీ సంస్థతో పాటు కాంట్రాక్ట్, పలు సొసైటీలలో ఉద్యోగులు పనిచేస్తున్నారని, సదరు ఉద్యోగులు విధులను బహిష్కరిస్తే ఎస్మా చట్టం ప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గతంలో టీటీడీలో విధులను బహిష్కరణ చేసినా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఈసారి విధుల నుంచి తొలగించాక విధులను బహిష్కరించిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరు. టీటీడీలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగులు ధర్నాలు చేయడం, నిరసన నోటీసులు ఇవ్వడం, ఊరేగింపులు చేయడం చట్టప్రకారం నిషేధం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా, ఉద్యోగుల విధులకు టీటీడీతో సంబంధం లేని బయట వ్యక్తులు ఆటంకం కల్గిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలకు వెనుకాడం’ అని టీటీడీ హెచ్చరించింది.

‘స్విమ్స్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పోరేషన్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు గత కొంత కాలంగా పలు రకాల కోరికలను కోరుతూ విధులను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నారని , టీటీడీ యాజమాన్యం చాలా సామరస్యంగా పరిష్కరించాలని ఉందన్నారు. సదరు ఉద్యోగులు సంబంధిత శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. స్విమ్స్‌లో ఎస్మా చట్టం అమలులో ఉన్నందున సమ్మె నోటిస్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. వైద్య సేవలకు ఆటంకం కల్గిస్తే విధుల నుండి తొలగించే నిబంధన ఉందని, తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. విధులను బహిష్కరించి సమ్మెకు దిగితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. స్విమ్స్ తో సంబంధం లేని బయట వ్యక్తుల ప్రమేయంతో నిరసనలకు దిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విధులను బహిష్కరించినందుకుగాను, ఒకసారి ఉద్యోగం తొలగించాక, సదరు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోరనే విషయాన్ని గమనించాలి’ అని స్విమ్స్ డైరెక్టర్ ఉద్యోగులను కోరారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి