Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Prabhas: ప్రభాస్ నుంచి ఇది ఊహించలేదుగా.. ఒక్క దెబ్బకు పాత రోజుల్ని గుర్తు చేసిన డార్లింగ్

3 July 2025

Coffee for Anti aging: చిన్న వయసులోనే వృద్ధాప్య ముంచుకొస్తుందా? అయితే రోజూ 2 కాఫీ కప్పులు లాగించేయండి

3 July 2025

Trolls On Ap High Court Judge,హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి: ట్రోల్స్‌పై ఆసక్తికరమైన స్పందన! – ap high court judge justice k srinivas reddy responds about trolls on him over ys jagan rentapalla case issue

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Perecherla To Kondamodu National Highway 167 Ag,ఏపీలో కొత్త నేషనల్ హైవే రూ.881.61 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగు లైన్లు.. హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు – new proposal that perecherla to kondamodu national highway 167 ag to connect with amaravati outer ring road
ఆంధ్రప్రదేశ్

Perecherla To Kondamodu National Highway 167 Ag,ఏపీలో కొత్త నేషనల్ హైవే రూ.881.61 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగు లైన్లు.. హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు – new proposal that perecherla to kondamodu national highway 167 ag to connect with amaravati outer ring road

.By .3 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Perecherla To Kondamodu National Highway 167 Ag,ఏపీలో కొత్త నేషనల్ హైవే రూ.881.61 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగు లైన్లు.. హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు – new proposal that perecherla to kondamodu national highway 167 ag to connect with amaravati outer ring road
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Perecherla To Kondamodu National Highway: ఆంధ్రప్రదేశ్‌లో పేరేచర్ల-కొండమోడు హైవేను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.881.61 కోట్లు కేటాయించింది. ఈ రహదారి గుంటూరు, హైదరాబాద్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. తాజాగా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ మూడు కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించాలని ప్రతిపాదించారు. దీనివల్ల హైదరాబాద్, పల్నాడు నుంచి అమరావతికి వెళ్లేవారికి ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రస్తుతం డిజైన్‌లో మార్పులు చేసి ఫిరంగిపురం బైపాస్‌ను వేములూరిపాడు దగ్గర కలపాలని యోచిస్తున్నారు.

హైలైట్:

  • ఏపీలో మరో నేషనల్ హైవే అమరావతి ORRకు కనెక్ట్
  • సరికొత్తగా మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు
  • కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాదనలు
పేరేచర్ల-కొండమోడు నాలుగు లేన్ల రోడ్డు
పేరేచర్ల-కొండమోడు నాలుగు లేన్ల రోడ్డు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలకమైన హైవేకు సంబంధించిన పనులు ప్రారంభంకానున్నాయి. పల్నాడు జిల్లాలో కీలకమైన.. అమరావతితో పాటుగా గుంటూరు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు పేరేచర్ల-కొండమోడు హైవేను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ రోడ్డు కోసం రూ. 881.61 కోట్లు కేటాయించారు. ఈ హైవే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి కూడా ఉపయోగంగా ఉంటుంది.. భాగ్యనగరానికి త్వరగా వెళ్లొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించింది. మేడికొండూరు నుంచి బైపాస్ ద్వారా వేములూరిపాడు దగ్గర పేరేచర్ల-కొండమోడు హైవే కలుస్తుంది. అక్కడి నుంచి ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకునేలా పేరేచర్ల దగ్గర పల్నాడు జిల్లా నరసరావుపేట బ్రిడ్జి వరకు 3 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేందుకు అధికారులు ప్రతిపాదించారు.. దీని కోసం దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనాకు వచ్చారు.ఈ కొత్త ప్రతిపాదనతో హైదరాబాద్, పల్నాడు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కొండమోడు రోడ్డు మీదుగా రాజధాని అమరావతికి వెళ్లేందుకు ఔటర్ రింగ్ రోడ్డుపైకి వెళ్లేలా ఈ హైవేను అనుసంధానం చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రతిపాదనను కేంద్రం దగ్గరకు తీసుకెళ్లారు. ఈ హైవేలో కొండమోడు నుంచి నాలుగు లైన్లు హైవేపైకి వచ్చే వాహనాలు వేములూరిపాడు దగ్గర గుంటూరు-కర్నూలు (రెండు లైన్లు) హైవేలోకి వెళతాయి. ఈ క్రమంలో వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకునేలా 3 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించాలని ప్రతిపాదించారు. ఈ మూడు కిలోమీటర్లు విస్తరిస్తే అమరావతి నుంచి హైదరాబాద్, పల్నాడు వెళ్లేవారికి.. హైదరాబాద్, పల్నాడు వైపు నుంచి అమరావతి వైపు వచ్చే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందంటున్నారు.

సీఎం కారులో.. సీఎంతో కలిసి.. దళితుడి ప్రయాణం

అనంతపురం నుంచి అమరావతికి కనెక్టివిటీ కోసం కొత్త నేషనల్ హైవేను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే గుంటూరు నుంచి కర్నూలు రోడ్డులో ఫిరంగపురం నుంచి బైపాస్ నిర్మాణం చేసి పేరేచర్ల-మేడికొండూరు రోడ్డు మధ్యలో అమరావతి ఓఆర్ఆర్‌లో కలిసేలా (కొండమోడు-పేరేచర్ల మార్గాన్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది) ప్లాన్ చేశారు. ఈ మేరకు ఇప్పుడు ఉన్న డిజైన్‌లో మార్పులు చేయాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పుడున్న డిజైన్ మార్చేసి.. కొండమోడు-పేరేచర్ల రహదారికి ఫిరంగిపురం నుంచి బైపాస్ మార్గాన్ని వేములూరిపాడు దగ్గర అనుసంధానం చేయడంతో పాటు అక్కడి నుంచి అమరావతి ఓఆర్ఆర్‌పైకి వెళ్లేట్లు ఆలోచన చేస్తున్నారు. ఇలా చేస్తే కొండమోడు-పేరేచర్ల హైవే నుంచి ప్రస్తుతం ప్రతిపాదించిన 3 కిలోమీటర్ల అనుసంధాన మార్గం అవసరం ఉండదని.. భూసేకరణ, రోడ్డు నిర్మాణ భారం ప్రభుత్వంపై తగ్గుతుందని భావిస్తున్నారు. మరి చూడాలి ఈ తాజా ప్రతిపాదనలపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి