కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా అందించాల్సిందేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు, వ్యక్తులు తమ పేరు, పుట్టిన తేదీ రుజువు లేదా ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను ఉపయోగించి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే పన్ను దాఖలులో జవాబుదారీతనంతో పాటు సమ్మతిని నిర్ధారించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కొత్త పాన్ కార్డులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. మీ పాన్ కార్డు దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి మీ ఆధార్ కార్డు ధ్రువీకరణ అనేది కచ్చితంగా చేయాలి.
ప్రస్తుత పాన్ కార్డుదారులు తమ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పాన్ ఉన్న వారు డిసెంబర్ 31, 2025లోపు జరిమానాలు లేకుండా తమ ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోవచ్చు. అనంతరం ఆధార్ కార్డుతో అనుసంధానించని ఏవైనా పాన్ కార్డులు చెల్లవని స్పష్టం చేస్తున్నారు. పన్నులను ఎగవేసేందుకు బహుళ పాన్ కార్డులను పొందిన లేదా వేరొకరి పాన్ను ఉపయోగించిన సందర్భాలను కనుగొన్న తర్వాత ఆదాయపు పన్ను శాఖ ఆధార్-పాన్ లింకేజీని తప్పనిసరి చేసింది. అదనంగా బహుళ పాన్లను ఉపయోగించి మోసపూరిత జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అనేక కేసులు నమోదయ్యాయి. మార్చి 2024 నాటికి భారతదేశంలోని 740 మిలియన్లకు పైగా పాన్ హోల్డర్లలో 605 మిలియన్ల మంది తమ ఆధార్ను అనుసంధానించారు.
ఇవి కూడా చదవండి
ఆధార్ కార్డుతో పాన్ కార్డుతో లింక్ ఇలా
- ముందుగా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ను సందర్శించాలి.
- హోమ్పేజీలో, క్విక్ లింక్స్ విభాగం కింద లింక్ ఆధార్పై క్లిక్ చేయాలి.
- మీ 10-అంకెల పాన్ నంబర్ మరియు 12-అంకెల ఆధార్ నంబర్ను నమోదు చేయాలి.
- ఆధార్ ప్రకారం మీ పేరును ఎంటర్ చేయాలి.
- నా ఆధార్ వివరాలను ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను అనే బాక్స్ వద్ద టిక్ పెట్టి, ‘ప్రామాణీకరించు’ క్లిక్ చేయాలి.
- అయితే రూ. 1,000 జరిమానా విధించాలని సూచిస్తూ “చెల్లింపు వివరాలు కనుగొనబడలేదు” అనే పాప్-అప్ కనిపిస్తుంది.
- అక్కడ ఈ-పే టాక్స్ ద్వారా చెల్లించడానికి కొనసాగించుపై క్లిక్ చేయాలి.
- అక్కడ మళ్లీ మీ పాన్ను నమోదు చేసి, పాన్ను నిర్ధారించండి, అలాగే ఓటీపీ స్వీకరించడానికి మీ మొబైల్ నంబర్ను అందించాలి.
- ఓటీపీ ధ్రువీకరణ తర్వాత మీకు ఈ-పే టాక్స్ పేజీ డిస్ప్లే అవుతుంది.
- ఆధార్తో పాన్ను లింక్ చేయడంలో జాప్యానికి రుసుముగా అసెస్మెంట్ సంవత్సరాన్ని 2025-26గా, చెల్లింపు రకం ఇతర రసీదులుగా (500), చెల్లింపు ఉప-రకాన్ని ఎంచుకోవాలి.
- జరిమానా మొత్తం (రూ. 1,000) ‘ఇతరులు’ కింద ఆటోమెటిక్గా పూరించబడుతుంది. ‘కొనసాగించు’ క్లిక్ చేయాలి.
- మీ చెల్లింపు పద్ధతిని ఎంచుకుని చెల్లింపును పూర్తి చేయాలి. అనంతరం ఒక చలాన్ జనరేట్ అవుతుంది.
- ఈ-ఫైలింగ్ పోర్టల్లోని లింక్ ఆధార్ విభాగానికి తిరిగి వెళ్లాలి.
- మీ పాన్, ఆధార్ నంబర్, పేరును ఆధార్లో ఉన్నట్లుగా తిరిగి నమోదు చేయాలి.
- 6 అంకెల ఓటీపీను స్వీకరించడానికి ఆధార్తో లింక్ చేయబడిన మీ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి.
- ఓటీపీని నమోదు చేసి, ‘ధృవీకరించు’ పై క్లిక్ చేస్తే మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డుతో లింక్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..