కీర్తి సురేష్ సమంత మంచి ఫ్రెండ్స్..వారు అప్పుడప్పుడు కలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సమంతకి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నా, తరచూ కలుసుకునే సాన్నిహిత్యం కొందరితోనే ఉంటుంది. అందులో కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటారు. వీరి స్నేహం ‘మహానటి’ సినిమా సమయంలో మొదలైంది. సినిమాలో కీర్తి సురేష్ లెజెండరీ నటి సావిత్రి పాత్ర పోషించగా, సమంత జర్నలిస్ట్ మధురవాణిగా కనిపించి అలరించింది.. ఈ సినిమా తర్వాత మొదలైన పరిచయం, ఇప్పటివరకు స్నేహంగా కొనసాగుతోంది. బీచ్ వాల్క్స్, పబ్ పార్టీలు, వెకేషన్లు… వీరిద్దరూ కలిసి కనిపించడం చాలా కామన్. తాజాగా వీరిద్దరి లంచ్ మీట్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. “టూ క్యూటీస్ ఇన్ వన్ ఫ్రేమ్” అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్స్ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సమంత ఇంటర్నేషనల్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ కోసం పని చేస్తోంది. కీర్తి సురేష్ విషయానికి వస్తే వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన ఉప్పు కప్పురంబు చిత్రం విడుదలకు రెడీ అవుతుండగా, మరో ప్రాజెక్ట్ “రివాల్వర్ రీటా” షూటింగ్ దశలో ఉంది. వీరిద్దరు ఓ పక్క కెరీర్లో బిజీగా ఉంటూనే, మరో పక్క స్నేహానికి విలువ ఇస్తూ కలిసి గడిపే సమయం అభిమానులందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైనేజీ నుండి వింత శబ్దాలు.. దగ్గరకి వెళ్లి చూసిన స్థానికులు పరుగో పరుగు
కడుపునొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. అనుమానం తో టెస్ట్ చేయగా.. ఖంగు తిన్న డాక్టర్స్