Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Annamayya Lorry Accident,అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది కూలీలు మృతి – annamayya district road accident pullampet lorry crash

13 July 2025

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

13 July 2025

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Talliki Vandanam Scheme 2nd Phase Eligible List,ఏపీలో తల్లికి వందనం రెండో విడత అర్హుల జాబితా.. మీ పేరు చెక్ చేస్కోండి, 10న డబ్బులు విడుదల – talliki vandanam scheme 2025 second phase payment beneficiaries eligible list full details here
ఆంధ్రప్రదేశ్

Talliki Vandanam Scheme 2nd Phase Eligible List,ఏపీలో తల్లికి వందనం రెండో విడత అర్హుల జాబితా.. మీ పేరు చెక్ చేస్కోండి, 10న డబ్బులు విడుదల – talliki vandanam scheme 2025 second phase payment beneficiaries eligible list full details here

.By .8 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Talliki Vandanam Scheme 2nd Phase Eligible List,ఏపీలో తల్లికి వందనం రెండో విడత అర్హుల జాబితా.. మీ పేరు చెక్ చేస్కోండి, 10న డబ్బులు విడుదల – talliki vandanam scheme 2025 second phase payment beneficiaries eligible list full details here
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద రెండో విడత నిధులను జూన్ 10న విడుదల చేయనుంది. మొదటి విడతలో డబ్బులు రానివారు, కొత్తగా చేరిన విద్యార్థుల తల్లులకు ఈ విడతలో రూ.13 వేలు జమ చేస్తారు. లబ్ధిదారుల జాబితాను పాఠశాలల్లో ఉంచుతారు, వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇంటర్ విద్యార్థులు ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ చేసుకోవాలని కూడా అధికారులు సూచించారు.

హైలైట్:

  • ఏపీలో తల్లికి వందనం రెండో విడత
  • ఈ నెల 10న డబ్బులు విడుదల
  • అదే రోజు మెగా పీటీఎం నిర్వహణ
ఏపీలో తల్లికి వందనం రెండో విడత అర్హులు
ఏపీలో తల్లికి వందనం రెండో విడత అర్హులు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు.. అలాగే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేవారికి కూడా డబ్బుల్ని ఇవ్వలేదు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.. ఆ అప్లికేషన్‌లను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది. అలాగే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరినవారి లిస్ట్‌ను కూడా రెడీ చేసింది.మంగళ, బుధవారాల్లో అర్హులైన తల్లుల ఎంపిక జాబితాలను విడుదల చేస్తారని చెబుతున్నారు.. స్కూళ్లకు సంబంధించి అర్హులైన తల్లుల జాబితాలను నేరుగా టీచర్ల లీప్‌ యాప్‌లో పొందుపరుస్తారు. వీరందరికి ఈ నెల 10న అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేస్తారు. అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వ వెబ్‌సైట్‌ https://gsws-nbm.ap.gov.in/ అందుబాటులో ఉంచింది.. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ApplicationStatusCheckP క్లిక్ చేయాలి.. అప్పుడు ఏ పథకమో (తల్లికి వందనం) సెలక్ట్ చేసుకోవాలి. ‘ ఆ పక్కనే ఉన్న 2025-26ను సెలక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. పథకానికి సంబంధించి లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది.. దానిని ఆ కాలమ్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు’ అంటున్నారు.

ఈ నెల 10న రెండు విశేషాలు ఉన్నాయి.. ఒకటి తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బుల్ని ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనుంది. రెండోది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ (పీటీఎం) నిర్వహించనున్నారు. ఒకే రోజు పీటీఎంతో పాటుగా తల్లికి వందనం డబ్బులు కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Thalliki vandanam status check: తల్లికి వందనం రాలేదా, అకౌంట్లో డబ్బులు పడలేదా, ఏం చేయాలంటే?

ఇదిలా ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్టియ్ చదువుతున్న ఎస్సీ విద్యార్థుల్ని అధికారులు అలర్ట్చేశారు. ఈనెల 10న తల్లికి వందనం రూ.13వేలు తల్లుల బ్యాంకు అకౌంట్‌లలో జమ చేస్తారని.. కాబట్టి బ్యాంకు అకౌంట్‌ను, ఆధార్‌ నంబరుకు ఎన్‌ పీసీఐ లింక్‌ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే తప్పనిసరిగా బ్యాంకు ఖాతా , లేని పక్షంలో పోస్టాఫీసు ఖాతాను తెరిచి ఆధార్‌ నంబరుకు ఎన్‌పీసీఐ లింక్‌ చేయించుకోవాలి అని సూచించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి