Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Annamayya Lorry Accident,అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది కూలీలు మృతి – annamayya district road accident pullampet lorry crash

13 July 2025

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

13 July 2025

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Sharmila,నా ప్రతి అడుగులోనూ నాన్నే.. హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలి: షర్మిల – ys sharmila pays tribute to ys rajasekhara reddy at idupulapaya
ఆంధ్రప్రదేశ్

Ys Sharmila,నా ప్రతి అడుగులోనూ నాన్నే.. హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలి: షర్మిల – ys sharmila pays tribute to ys rajasekhara reddy at idupulapaya

.By .8 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Sharmila,నా ప్రతి అడుగులోనూ నాన్నే.. హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలి: షర్మిల – ys sharmila pays tribute to ys rajasekhara reddy at idupulapaya
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని ఆమె కొనియాడారు. హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఏఐసీసీ పెద్దలను కూడా కోరినట్లు, వారికి లేఖలు రాసినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

హైలైట్:

  • వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్ షర్మిల
  • తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయకు షర్మిల
  • వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటుపై రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి

స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మంగళవారం ఉదయం ఆమె తల్లి విజయమ్మతో కలిసి నివాళులు అర్పించి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమం పేరుతో జనం గుండెల్లో చెరగని సంతకం చేసిన మహానేత వైఎస్సార్ అని.. తన ప్రతి అడుగులోనూ నాన్నే మార్గదర్శకం, స్ఫూర్తి అంటూ షర్మిల కొనియాడారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్సార్.. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారంటూ కొనియాడారు. సుపరిపాలన, సంక్షేమ పథకాలతో కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారని, రాష్ట్రంలో ఆయన మార్క్ చూపించారన్నారు.
వైఎస్సార్ జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో ఓ స్మృతివనం ఏర్పాటు చేయాలని షర్మిల కోరారు. ఇది వైఎస్సార్ అభిమానులు, ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి తన విజ్ఞప్తన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్మృతి వనం ఏర్పాటు గురించి ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ సందర్భానుసారంగా స్పందిస్తోంది. తాజాగా కరేడు రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపగా.. వైఎస్ షర్మిల కూడా ప్రభుత్వంపై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. కరేడులో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

మహేష్ గోనె

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వర రావు (మహేష్ గోనె) తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.… ఇంకా చదవండి