Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Annamayya Lorry Accident,అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది కూలీలు మృతి – annamayya district road accident pullampet lorry crash

13 July 2025

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

13 July 2025

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kurnool Farmer Rs 8 Lakhs,అయ్యో పాపం ఆ రైతు.. రూ.9 లక్షలు దాచుకుంటే ఇలా అయ్యిందేంటి, డబ్బులు ఉన్నాయనుకుంటే! – farmer lost rs 8 lakh from his bank accounts in kurnool district
ఆంధ్రప్రదేశ్

Kurnool Farmer Rs 8 Lakhs,అయ్యో పాపం ఆ రైతు.. రూ.9 లక్షలు దాచుకుంటే ఇలా అయ్యిందేంటి, డబ్బులు ఉన్నాయనుకుంటే! – farmer lost rs 8 lakh from his bank accounts in kurnool district

.By .8 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kurnool Farmer Rs 8 Lakhs,అయ్యో పాపం ఆ రైతు.. రూ.9 లక్షలు దాచుకుంటే ఇలా అయ్యిందేంటి, డబ్బులు ఉన్నాయనుకుంటే! – farmer lost rs 8 lakh from his bank accounts in kurnool district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Kurnool Farmers Rs 8 Lakhs Cyber Cheating: రంగస్వామి అనే రైతు తన కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ల పాలు చేసుకోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నాడు. మిరప పంట అమ్మగా వచ్చిన డబ్బులు బ్యాంకులో వేయించుకున్నాడు. సిమ్ కార్డు సమస్యతో అసలు కథ మొదలైంది. ఖాతాలో డబ్బులు మాయం కావడంతో లబోదిబోమంటున్నాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. ఈ దుస్థితికి కారణమైన ఆ చిన్న పొరపాటు ఏమిటి?

హైలైట్:

  • కర్నూలు జిల్లా ఆదోనిలో ఘటన
  • బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు మాయం
  • రూ.8 లక్షలు కొట్టేసిన సైబర్ గ్యాంగ్
ఆదోని రైతు ఖాతాల్లో డబ్బులు మాయం
ఆదోని రైతు ఖాతాల్లో డబ్బులు మాయం (ఫోటోలు– Samayam Telugu)

ఆరుగాలం కష్టపడి పంట పండించాడు.. మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించాడు. ఈ ఏడాది వ్యవసాయం చేయడానికి పెట్టుబడికి డబ్బులు దొరికాయిలే అనుకున్నాడు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు లేకుండా పోయింది.. రైతు సొమ్ము సైబర్ కేటగాళ్ల పాలైంది. పాపం తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పుతో డబ్బులు మొత్తం సైబర్ నేరగాళ్లు నొక్కేశారు. ఈ ఏడాది వ్యవసాయం చేసేది ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించాడు.కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటానికి చెందిన పైగేరి కురవ రంగస్వామి వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన 15 ఎకరాల్లో మిరప సాగు చేయగా.. మంచి దిగుబడి వచ్చింది. మిర్చికి మంచి ధర వస్తుందని భావించి 400 బస్తాలను తీసుకెళ్లి కర్ణాటకలోని బ్యాడిగలో ఉన్న కోల్డ్ స్టోరేజీలో ఉంచారు. అయితే ఈ ఏడాది వ్యవసాయం కోసం పెట్టుబడికి డబ్బులు కావాల్సి వచ్చింది. గత నెల 24న రంగస్వామి తన మిర్చి పంటను వ్యాపారులకు విక్రయించగా.. రూ.9.2 లక్షలు వచ్చింది. అయితే తనకు డబ్బులు రూపంలో కాకుండా బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయమని రైతు కోరాడు.

రంగస్వామి కోరిక మేరకు.. ఆదోనిలోని కెనరా బ్యాంకు అకౌంట్ (0601101023863)లో రూ.5 లక్షలు జమ చేశారు. మరో రూ.4.2 లక్షలు బ్యాంకు ఆఫ్‌ బరోడా అకౌంట్‌లో (37038100011295) జమ చేశారు. అయితే రంగస్వామి మొబైల్‌కు డబ్బులు జమ చేసినట్లు ఎలాంటి మెసేజ్ రాలేదు. అయితే రైతు చాలా కాలంగా సిమ్‌కార్డు ఉపయోగించడం లేదు.. సిమ్ డిస్ కనెక్ట్ అయ్యిందమోనని భావించి అదే నెంబరు సిమ్‌ తీసుకోవాలని ఆధార్‌ కార్డుతో షాపునకు వెళ్లాడు. అక్కడ సిమ్, ఆధార్‌ కార్డు బ్లాక్‌ అయ్యాయని షాపులో వ్యక్తి చెప్పడంతో రంగస్వామి షాకయ్యాడు.

అయితే ఇదంతా జరిగిన తర్వాత ఎందుకో అనమానం వచ్చి వారం తర్వాత బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌లో డబ్బులు చెక్ చేసుకుంటే రూ.లక్ష మాత్రమే ఉంది.. దీంతో రైతు ఆందోళనకు గురయ్యారు. అప్పుడు బ్యాంక్ సిబ్బంది చెక్ చేస్తే.. సైబర్‌ నేరగాళ్లు గత నెల 30వ తేదీ నుంచి విడతల వారీగా రూ.8 లక్షలు ఖాళీ చేశారని గుర్తించారు. రంగస్వామి బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ చెక్చేయగా.. మహారాష్ట్రలోని నాసిక్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, తమిళనాడు ప్రాంతాల నుంచి హ్యాక్‌ చేసి డబ్బుల్ని విత్‌డ్రా చేసినట్లు తేలింది. బాధిత రైతు రంగస్వామి హొళగుంద పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కష్టపడి పంట పండించి సంపాదించిన డబ్బులు సైబర్ నేరగాళ్లు కొట్టేశారని రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.. తాను వ్యవసాయం చేయడానికి డబ్బులు లేకుండా పోయాయన్నారు.

శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు మళ్లీ ప్రారంభం

స్కూల్‌కు వెళ్లిన తొలిరోజే బస్సు కింద పడి నలిగిపోయి చిన్నారి మృతి.. ఎంత విషాదం, సీసీటీవీ వీడియో.

మహానంది: చెట్ల పొదల్లో మహిళ దుస్తులు, నిమ్మకాయలు.. అక్కడ అసలు ఏం జరిగింది?

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి