Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Annamayya Lorry Accident,అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది కూలీలు మృతి – annamayya district road accident pullampet lorry crash

13 July 2025

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

13 July 2025

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Aeo Suspend,అన్యమత ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ.. సస్పెండ్ చేసిన అధికారులు! – ttd aeo rajasekhar babu suspended for allegedly took part in sunday church prayers in puttur
ఆంధ్రప్రదేశ్

Ttd Aeo Suspend,అన్యమత ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ.. సస్పెండ్ చేసిన అధికారులు! – ttd aeo rajasekhar babu suspended for allegedly took part in sunday church prayers in puttur

.By .8 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Aeo Suspend,అన్యమత ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ.. సస్పెండ్ చేసిన అధికారులు! – ttd aeo rajasekhar babu suspended for allegedly took part in sunday church prayers in puttur
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఏ.రాజశేఖర్ బాబు అనే అధికారి అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్నందుకు సస్పెండ్ అయ్యారు. పుత్తూరులోని చర్చిలో ఆయన ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ జరిపింది. ఆయన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీటీడీ పేర్కొంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రాజశేఖర్ బాబుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ అధికారిక నోట్‌ను కూడా రిలీజ్ చేశారు.

హైలైట్:

  • చర్చి ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ
  • ఫొటోలు తీసి టీటీడీకి ఇచ్చిన ఓ భక్తుడు
  • విచారణ చేపట్టి సస్పెండ్ చేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్న అధికారిని టీటీడీ సస్పెండ్ చేసింది. ఆ అధికారి వ్యవహార శైలి, ప్రవర్తనపై టీటీడీ విజిలెన్స్ విభాగం ఓ నివేదికను సంబంధిత అధికారులను అందజేసింది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఏ.రాజశేఖర్ బాబు తిరుపతి జిల్లా పుత్తూరులో ప్రతి ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నాడనే సమాచారం అందింది. ఓ భక్తుడు ఆయన చర్చి ప్రార్థనల్లో పాల్గొంటుండగా ఫొటోలు, వీడియోలు తీసి టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన అధికారులు రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
టీటీడీ ఉద్యోగిగా ఉంటూనే సంస్థ ప్రవర్తన నియమావళిని పాటించకపోవడమే కాకుండా, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిథ్యం వహించే ఉద్యోగిగా ఉంటూ బాధ్యతారహితంగా వ్యవహరించాడంటూ టీటీడీ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
మహేష్ గోనె

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వర రావు (మహేష్ గోనె) తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.… ఇంకా చదవండి