Basavatarakam Cancer Hospital Rs 85 Lakh Donation: ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.85 లక్షల విరాళం అందజేసింది. ఫ్లోరిడాలో జరిగిన తెలుగు సంబరాల్లో ఈ విరాళాన్ని నందమూరి బాలకృష్ణకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ బాధితుల కోసం బసవతారకం ఆసుపత్రి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనుంది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చొరవతో, నారా బ్రాహ్మణి స్పందించి ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు.
హైలైట్:
- బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భారీ విరాళం
- చెక్కును బాలయ్యకు ఇచ్చి నాట్స్ సభ్యులు
- బలభద్రపురానికి అండగా నిలిచిన ఆస్పత్రి

ఈ క్యాన్సర్ కేసుల అంశం సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణికి తెలిసి ఆమె స్వయంగా బసవతారకం ఆస్పత్రి సీఈవో కృష్ణయ్యతో మాట్లాడారన్నారు. ఆ వెంటనే సీఈవో ఇద్దరు డాక్టర్లను పంపారని.. ఊరిలో అందరికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారన్నారు.. ఒకవేళ ఎవరికైనా వ్యాధి ఉంటే బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తారని తెలిపారు. అలాగే ఆరోగ్యవంతమైన బలభద్రపురాన్ని చూడటమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్లి. క్యాన్సర్ సాధారణంగా మూడు, నాలుగు దశలకు వచ్చే వరకు తెలియదన్నారు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ కృష్ణప్రసాద్. అప్పుడు చికిత్స చేసినా ఫలితం ఉండదన్నారు.
Nandamuri Balakrishna: హిందీలో అదరగొట్టిన బాలయ్య
బలభద్రపురం ప్రజల ఆరోగ్యానికి బసవతారకం ఆసుపత్రి సహాయం చేయడానికి ముందుకు రావడంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఇటీవల బలభద్రపురంలో పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య పర్యటించారు.. పరిశ్రమలపై ఆరా తీశారు. బలభద్రంపురంలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది.. ఊరిలో ప్రజలకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కూడా అండగా నిలిచింది.