Andhra Pradesh Parents Teachers Mega Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరవుతారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలపై చర్చిస్తారు. మొక్కలు నాటడం, ఆటల పోటీలు, భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డు అందజేస్తారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. ఈ సమావేశంలో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
హైలైట్:
- ఏపీలో మెగా పేరెంట్, టీచర్ సమావేశం
- ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు
- ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డు కూడా ఇస్తారు

అంతేకాదు ఈ కార్యక్రమంలో నో టు డ్రగ్స్, సైబర్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో స్కూల్ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులు, విద్యా కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు కలిసి స్కూళ్లలోనే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేస్తారు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమం ముగుస్తంది. ఈ మెగా సమావేశంలో ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు (సమగ్ర ప్రగతి పత్రం) కూడా ఇస్తారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో పోటీగా ఈ కార్డులు ఇస్తున్నారు. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థి వివరాలు, మార్కులు, హాజరు, నైపుణ్యాలు వంటివి ఉంటాయి. ఈ ఏడాది తల్లిదండ్రుల అభిప్రాయానికి కూడా అవకాశం కల్పించింది ప్రభుత్వం.
అప్పుడు మా నాన్నను తిట్టుకునేవాడినన్న మంత్రి లోకేష్
మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవుల పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి స్కూలు మొత్తానికి ఇచ్చేందుకు కాదు. అటు ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.. ఎవరైనా ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ బడుల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటాము’ అన్నారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు.