Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra News: ఎంత విషాదం..పెంచలేక పేగుబంధాన్ని విక్రయించిన కన్నతల్లి!

12 July 2025

Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Narasapuram Chennai Vande Bharat Express,ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఆ రూట్లోనే, కేంద్ర మంత్రి కీలక ప్రకటన – narasapuram chennai vande bharat express train will be launched soon said by union minister srinivasa varma
ఆంధ్రప్రదేశ్

Narasapuram Chennai Vande Bharat Express,ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఆ రూట్లోనే, కేంద్ర మంత్రి కీలక ప్రకటన – narasapuram chennai vande bharat express train will be launched soon said by union minister srinivasa varma

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Narasapuram Chennai Vande Bharat Express,ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఆ రూట్లోనే, కేంద్ర మంత్రి కీలక ప్రకటన – narasapuram chennai vande bharat express train will be launched soon said by union minister srinivasa varma
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో త్వరలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసాపురం – చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ బుధవారం వెల్లడించారు. నరసాపురం రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో నరసాపురం – అరుణాచలం ప్రత్యే రైలును భూపతిరాజు శ్రీనివాసవర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు.

ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు..
ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. (ఫోటోలు– Samayam Telugu)

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు త్వరలోనే మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. నరసాపురం – చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. నరసాపురం – చెన్నై మార్గంలో త్వరలోనే వందే భారత్ రైలును ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం నరసాపురం రైల్వేస్టేషన్‌లో నరసాపురం – తిరువణ్ణామలై ప్రత్యేక రైలు సర్వీసును కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రారంభించారు. అనంతరం అదే రైలులో భీమవరం వరకూ ప్రయాణించారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా ఉభయ గోదావరి జిల్లా వాసులకు లబ్ధి చేకూరుతుందని శ్రీనివాసవర్మ తెలిపారు. అలాగే తిరుపతి, అరుణాచలం వెళ్లేందుకు అవకాశం కలుగుతుందన్నారు. రాబోయే రోజులలో వారానికి మూడు రోజులు నరసాపురం – అరుణాచలం ప్రత్యేక రైలు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

మరోవైపు ఏపీ మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటోంది. విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 5:45 గంటలకు బయలుదేరి.. అదే రోజు మధ్యాహ్నం 2:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. 699 కి.మీ. దూరాన్ని 8 గంటల 35 నిమిషాలలో చేరుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరితే.. అదే రోజు రాత్రి 11:35 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

వందే భారత్‌ రైల్లో ఎమ్మెల్యే అనుచరుల వీరంగం.. సీటు ఇవ్వలేదని ప్రయాణికుడ్ని కొట్టి

మరోవైపు సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య మరోన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా నడుస్తోంది. ఈ రైలు గురువారం తప్ప వారంలో మిగతా ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రబాద్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయలుదేరితే.. అదే రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరితే.. రాత్రి 11:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.మరోవైపు విజయవాడ – చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా నడుస్తోంది. బుధవారం తప్ప వారంలో మిగతా రోజులు ఈ విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో ఉంటుంది. 517 కి.మీ. దూరాన్ని 6 గంటల 40 నిమిషాలలో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరితే.. రాత్రి 10:00 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చెన్నై నుంచి ఉదయం 5:30 గంటలకు చెన్నై విజయవాడ వందే భారత్ రైలు బయల్దేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12:10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

వీటితో పాటుగా విశాఖపట్నం – భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, దుర్గ్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఏపీ మీదుగా నడుస్తున్నాయి. త్వరలోనే విజయవాడ – బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కించే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి