Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

తండ్రిని చంపేసి.. సెకండ్‌ షో సినిమాకు వెళ్లిన కూతురు! ఆ తర్వాత జరిగిందిదే..

10 July 2025

Kejriwal: నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న కేజ్రీవాల్.. ఆ కేటగిరీలో ఇవ్వొచ్చంటూ బీజేపీ కౌంటర్..

10 July 2025

Ap Multipurpose Workers 3 Months Salaries,ఏపీలో ఆ ఉద్యోగులకు పండగే.. మూడు నెలల జీతం ఒకేసారి, బ్యాంక్ అకౌంట్‌లలో జమ – andhra pradesh government released three months salaries for grama panchayat multipurpose workers

10 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Husband And Wife Thefts,మొగుడూ పెళ్లాం.. ఓ దొంగాట, చివరకు పాపం! – pendurthi police arrest husband and wife for stealing gold from shops
ఆంధ్రప్రదేశ్

Husband And Wife Thefts,మొగుడూ పెళ్లాం.. ఓ దొంగాట, చివరకు పాపం! – pendurthi police arrest husband and wife for stealing gold from shops

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Husband And Wife Thefts,మొగుడూ పెళ్లాం.. ఓ దొంగాట, చివరకు పాపం! – pendurthi police arrest husband and wife for stealing gold from shops
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ జంట దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. 2025 ఫిబ్రవరిలో రెండు బంగారు దుకాణాల్లో ఉంగరాలు చోరీ చేసిన గణేష్, మాణిక్యేశ్వరి అనే భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ కోర్టు వారికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించింది. మరోవైపు జ్ఞానాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. పాడుబడిన భవనం పక్కన 15 మొక్కలు ఉండటంతో పోలీసులు వాటిని ల్యాబ్ కు పంపించి దర్యాప్తు చేస్తున్నారు.

మొగుడూ పెళ్లాం.. ఓ దొంగాట, చివరకు పాపం!
మొగుడూ పెళ్లాం.. ఓ దొంగాట, చివరకు పాపం! (ఫోటోలు– Samayam Telugu)

దంపతులు అంటే ఎలా ఉండాలి.. రాబోయే కొత్త తరానికి ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి. భారతీయ వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని చాటేలా నడుచుకోవాలి. కానీ విశాఖపట్నం జిల్లా పెందుర్తి లో మాత్రం ఓ జంట ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. అదేదో సినిమాలో రోమియో, జూలియట్ అంటూ తరుణ్, ఇలియానా చోరీలు చేసినట్లు వీరు కూడా వ్యవహరించారు. చివరకు జైలు పాలై ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..

2025 ఫిబ్రవరిలో పెందుర్తిలోని రెండు బంగారం షాపుల్లో చోరీ జరిగింది. రెండు దుకాణాల్లోనూ ఉంగరాలు చోరీకి గురయ్యాయి. ఈ విషయమై షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కాకినాడకు చెందిన భార్యాభర్తల హస్తం దీని వెనుక ఉన్నట్లు గుర్తించారు. గణేష్, మాణిక్యేశ్వరి జంట ఈ బంగారు షాపులలో ఉంగరాలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో విచారణ పూర్తి కాగా.. విశాఖ ఏడవ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు వీరికి.. ఏడాది జైలు శిక్ష, రూ.200 జరిమానా విధించింది.

పాడుబడిన ఇంటి పక్కన గంజాయి..

మరోవైపు విశాఖపట్నంలోని జ్ఞానాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో గంజాయి కలకలం రేపింది. రాసవీధిలోని పాడుబడిన భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో కంచరపాలెం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాడుబడిన భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మొత్తం 15 మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇవి గంజాయి మొక్కలా కాదా అనే క్లారిటీ పోలీసులు ఇవ్వలేదు. మొక్కలు మాత్రం గంజాయి మొక్కలను పోలి ఉన్నాయని, కానీ వాటి వాసన మాత్రం వేరేలా ఉందని పోలీసులు తెలిపారు. దీంతో ఈ మొక్కల ఆకులను పోలీసులు ల్యా్బ్‌కు పంపించారు.

ప్రేయసి కోసం సొంతింట్లో ఎవరైనా ఇలా చేస్తారా? అడ్డంగా బుక్కయ్యాడు!

మరోవైపు పాడుబడిన భవనం పక్కనే ఉన్న ఈ ఖాళీ స్థలంలో ఎవరైనా వీటిని వేశారా.. లేదా వాటికవే పెరిగాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇవి గంజాయి మొక్కలేనని స్థానికులు చెప్తున్నారు. కొంతమంది యువకులు ఇక్కడ గంజాయి సేవిస్తుంటారని.. వారు వేసిన గింజలే ఇలా మొక్కలయ్యాయని చెప్తున్నారు. దీనిపై పోలీసుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి