Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video : ఏమి జోకేశాడేమో..పంత్ తెగ నవ్వేస్తున్నాడు.. ఏదేమైనా గంభీర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది

12 July 2025

Coral Jewellery: పగడపు నగలు ధరిస్తే లాభాలు ఏంటి.? జ్యోతిష్యం ఏం చెబుతుందంటే.?

12 July 2025

Gold Anklets: కాళ్లకు బంగారు పట్టిలు ధరించవచ్చా.? పండితుల మాటేంటి.?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Duvvada Srinivas On Chiranjeevi As Cm,ఆయన రాజకీయాల్లో ఉండుంటే కచ్చితంగా సీఎం అయ్యేవారు.. నేను ఎన్నికల్లో ఓడిపోయానని డబ్బులు పంపారు: దువ్వాడ శ్రీనివాస్ – mlc duvvada srinivas interesting comments on megastar chiranjeevi as cm
ఆంధ్రప్రదేశ్

Duvvada Srinivas On Chiranjeevi As Cm,ఆయన రాజకీయాల్లో ఉండుంటే కచ్చితంగా సీఎం అయ్యేవారు.. నేను ఎన్నికల్లో ఓడిపోయానని డబ్బులు పంపారు: దువ్వాడ శ్రీనివాస్ – mlc duvvada srinivas interesting comments on megastar chiranjeevi as cm

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Duvvada Srinivas On Chiranjeevi As Cm,ఆయన రాజకీయాల్లో ఉండుంటే కచ్చితంగా సీఎం అయ్యేవారు.. నేను ఎన్నికల్లో ఓడిపోయానని డబ్బులు పంపారు: దువ్వాడ శ్రీనివాస్ – mlc duvvada srinivas interesting comments on megastar chiranjeevi as cm
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Duvvada Srinivas On Chiranjeevi: వైఎస్సార్‌సీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన విషయాలు వెల్లడించారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఆర్ధికంగా నష్టపోతే, చిరంజీవి సహాయం చేశారని తెలిపారు. అంతేకాకుండా, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దని చిరంజీవితో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చిరంజీవి సీఎం అయ్యేవారని దువ్వాడ అభిప్రాయపడ్డారు.

హైలైట్:

  • దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • 2009 పరిస్థితుల గురించి ప్రస్తావన
  • న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు
చిరంజీవిపై దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు
చిరంజీవిపై దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు (ఫోటోలు– Samayam Telugu)

వైఎస్సార్‌సీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు ముందు 2009 ఎన్నికల సమయంలో పరిస్థితులపై ఆసక్తికర విషయాలు చెప్పారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయడం, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ‘ఎన్నికల్లో పోటీ చేశావు, ఓడిపోయావు, చాలా ఇబ్బంది ఉంటుంది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వెనక్కు తగ్గాం.. నీకు ఖర్చులు అయ్యుంటాయి.. పాపం నష్టపోయి ఉంటావు అని నష్టాన్ని కూడా భర్తీ చేశారు.. నా ఇంటికి డబ్బులు పంపించారు’ అని దువ్వాడ శ్రీనివాస్ 2009 ఎన్నికల తర్వాత పరిస్థితుల్ని వివరించారు. ‘ఏమనుకుంటున్నారు చిరంజీవిగారంటే.. ఇదంతా నా అనుభవం, నా స్వీయ అనుభవం.. కొంతమంది నాయకులకు తెలుసు.. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావుకు తెలుసు.. వారి ద్వారానే డబ్బులు పంపించారు. నేను ఆర్థికంగా ఇబ్బందిపడకూడదు.. నేను దగ్గరుండి నామినేషన్ వేయించాను.. పాపం శ్రీనివాస్ ఇబ్బందిపడ్డాడు.. ఖర్చులు అయ్యుంటాయని సాయం చేశారు’ అన్నారు దువ్వాడ శ్రీనివాస్.’ప్రజారాజ్యం పార్టీ విలీనం సమయంలో కూడా చిరంజీవి గారితో మాట్లాడాను. ప్రజలు ప్రజారాజ్యం పార్టీ పక్షాన ఉన్నారు.. ఏనాటికైనా ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దని చిరంజీవి గారిని కోరాను.. కానీ నేను మాట్లాడేటప్పటికి విలీన ప్రక్రియపై చర్చలు ముగిశాయి. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లలేకపోయాను.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలోకి వెళ్లాను. రాజకీయాల నుంచి తప్పుకుని చిరంజీవిగారు మంచి పనిచేశారు.. కానీ అలా రాజకీయాల్లో కొనసాగి ఉంటే బావుండేదేమో. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చిరంజీవి కచ్చితంగా సీఎం అయ్యేవారు’ అన్నారు.

‘ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో నాకు చిరంజీవి కబురు పెట్టారు.. అప్పటి నుంచి ఆయన్ను అన్నయ్య అని పిలిచాను. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు 200 వాహనాలతో తిరుపతికి ర్యాలీగా వెళ్లాము. ఆ కార్యక్రమంలో నాకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు.. చిరంజీవిని ఇష్టపడతాను. మా జిల్లాలో చాలామంది ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చేరిన తర్వాత నాకు టికెట్ రాకుండా ప్రయత్నం చేశారు. చిరంజీవి రమ్మన్నారు వచ్చాను.. అన్నయ్య నాకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదేమో.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ సమయంలో శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వకపోతే అర్ధం లేదని చిరంజీవి అన్నారు. అప్పుడు అధిష్టానం నుంచి నాకు బీఫామ్ తీసుకుని వచ్చారు. 2009 ఎన్నికల్లో పోటీచేసి 3,500 ఓట్లతో ఓడిపోయాను. అచ్చెన్నాయుడు, రేవతిపతి, నా మధ్య పోటీ జరిగింది’ అని చెప్పుకొచ్చారు.

డ్యాన్స్‌తో అదరగొట్టిన దువ్వాడ, దివ్వెల మాధురి జంట.. అబ్బో ఓ రేంజ్‌లో ఇరగదీశారు కదా

‘టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్న రేవతిపతి గారు చనిపోయారు.. ఉప ఎన్నిక వచ్చింది. శ్రీనివాస్ పోటీ చేయాలని చిరంజీవి చెప్పారు. నేను టెక్కలి వస్తాను.. ప్రచారం చేస్తానని చెప్పారు. నా నామినేషన్ కోసం చిరంజీవి స్వయంగా వచ్చారు. నేను ప్రజారాజ్యం పార్టీలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన తర్వాత మూడు, నాలుగు రోజులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. అన్నయ్య రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం అని చెప్పాను.. అప్పుడు ఉప ఎన్నిక నుంచి వెనక్కు తగ్గాము.. పోటీచేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవతిపతి భార్య భారతికి వేయమని మద్దతు తెలిపాను’ అని వివరించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి