Annamayya Walkway To Tirumala Restrictions: అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు వెళ్తున్న వెయ్యి మంది భక్తులను అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం కారణంగా అడ్డుకున్నారు. రైల్వే కోడూరు, కమలాపురం నుంచి వస్తున్న భక్తులను అనుమతించలేదు. పూర్వం అన్నమాచార్యులు నడిచిన ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సైతం ఈ మార్గం గుండా తిరుమలకు వెళ్లేవారు. ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించారు.
హైలైట్:
- అన్నమయ్య కాలిబాటలో తిరుమలకు భక్తులు
- వారిని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
- అనుమతి లేదు.. వెనక్కు వెళ్లిపోవాలని చెప్పారు

తిరుమల దర్శనం కోసం ఆ భక్తుడు ఏం చేశాడో చూశారా.. చివరికి క్షమాపణలు చెప్పాడుగా..!
ఈ కాలిబాటను అభివృద్ధి చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. గతంలో దీని గురించి TTD ఆలోచించగా.. చర్చలు కూడా జరిగాయి. ఈ రూట్లో మామండూరు-బాలపల్లె మధ్య స్వామిపాదాల నుంచి తిరుమల కాలిబాట మొదలవుతుంది. ఈ దారిలో పక్షుల కిలకిల రావాలు, సెలయేళ్లు, మంచి వాతావరణం ఉంటాయి. అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పాత సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం మీదుగా గోగర్భతీర్థం (తిరుమల) చేరుకోవచ్చు. ఈ కాలిబాట సుమారు 14 కిలోమీటర్ల దూరం పూర్తిగా అడవిలో ఉంటుంది. పూర్వం ఇక్కడ పాదాలు, కోనేరు, సత్రాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి కనుమరుగయ్యాయి. గతంలో చాలామంది భక్తులు ఈ దారి గుండా తిరుమలకు వెళ్లేవారు. ఇప్పుడు తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకుంటున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రతి ఏటా స్థానికులు, భక్తులతో కలిసి ఈ మార్గంలోనే తిరుమలకు చేరుకునేవారు. అయితే ప్రస్తుతం ఏనుగుల గుంపు తిరుగుతుండటంతో భక్తులు ఈ మార్గం నుంచి వెళ్లొద్దని సూచిస్తున్నారు.