Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025

Instagram Shopping Scam: ఇన్‌ స్టాగ్రామ్ లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Annamayya Margam To Tirumala Darshan,తిరుమలకు కాలినడకన వస్తున్న వెయ్యిమంది భక్తులు.. వెనక్కు వెళ్లిపొమ్మన్న సిబ్బంది, కారణం ఏంటంటే! – forest officials restrictions for devotees in annamayya walkway to tirumala
ఆంధ్రప్రదేశ్

Annamayya Margam To Tirumala Darshan,తిరుమలకు కాలినడకన వస్తున్న వెయ్యిమంది భక్తులు.. వెనక్కు వెళ్లిపొమ్మన్న సిబ్బంది, కారణం ఏంటంటే! – forest officials restrictions for devotees in annamayya walkway to tirumala

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Annamayya Margam To Tirumala Darshan,తిరుమలకు కాలినడకన వస్తున్న వెయ్యిమంది భక్తులు.. వెనక్కు వెళ్లిపొమ్మన్న సిబ్బంది, కారణం ఏంటంటే! – forest officials restrictions for devotees in annamayya walkway to tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Annamayya Walkway To Tirumala Restrictions: అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు వెళ్తున్న వెయ్యి మంది భక్తులను అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం కారణంగా అడ్డుకున్నారు. రైల్వే కోడూరు, కమలాపురం నుంచి వస్తున్న భక్తులను అనుమతించలేదు. పూర్వం అన్నమాచార్యులు నడిచిన ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సైతం ఈ మార్గం గుండా తిరుమలకు వెళ్లేవారు. ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించారు.

హైలైట్:

  • అన్నమయ్య కాలిబాటలో తిరుమలకు భక్తులు
  • వారిని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
  • అనుమతి లేదు.. వెనక్కు వెళ్లిపోవాలని చెప్పారు
అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు
అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వెయ్యిమంది భక్తుల్ని అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆపారు. ఈ మార్గం నుంచి రావొద్దని వెనక్కు పంపారు.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, కడప జిల్లా కమలాపురం నుంచి దాదాపు వెయ్యిమంది అన్నమయ్య కాలిబాట మీదుగా తిరుమల దర్శనానికి వస్తున్నారు. అయితే అడవి మధ్యలో ఈ మార్గంలో రావొద్దని.. అనుమతి లేదని అటవీశాఖ సిబ్బంది చెప్పారు. అడవిలో ఏనుగుల మంద పిల్లలతో సంచరిస్తోందన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమన్నారు. భక్తులు మాత్రం తాము అన్నమయ్య కాలుబాట మీదనే దర్శనానికి వెళ్లాలి అంటున్నారు. అటవీశాఖ అధికారులు వారితో మాట్లాడి అక్కడి నుంచి పంపించారు.తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో తిరుమలకు చేరుకుంటారు. అలాగే ఘాట్ రోడ్ల ద్వారా కూడా కొండకు వస్తారు. ఈ మూడు మార్గాలు కాకుండా తిరుమలకు చేరుకోవడానికి మరో మార్గం కూడా ఉందని మీకు తెలుసా.. అవును అదే అన్నమయ్య కాలిబాట. రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి తిరుమలకు వెళ్లొచ్చు. వెయ్యేళ్ల క్రితం అన్నమాచార్యులు ఏడుకొండలకు నడిచి వెళ్ళిన దారి ఇదేనని చెబుతుంటారు. శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32వేల కీర్తనలు రాసిన అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో నడవటం గొప్ప అదృష్టంగా భక్తులు భావిస్తున్నారు. ఈ కాలిబాట ద్వారా తిరుమల కొండకు వెళుతున్నారు.

తిరుమల దర్శనం కోసం ఆ భక్తుడు ఏం చేశాడో చూశారా.. చివరికి క్షమాపణలు చెప్పాడుగా..!

ఈ కాలిబాటను అభివృద్ధి చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. గతంలో దీని గురించి TTD ఆలోచించగా.. చర్చలు కూడా జరిగాయి. ఈ రూట్‌లో మామండూరు-బాలపల్లె మధ్య స్వామిపాదాల నుంచి తిరుమల కాలిబాట మొదలవుతుంది. ఈ దారిలో పక్షుల కిలకిల రావాలు, సెలయేళ్లు, మంచి వాతావరణం ఉంటాయి. అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పాత సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం మీదుగా గోగర్భతీర్థం (తిరుమల) చేరుకోవచ్చు. ఈ కాలిబాట సుమారు 14 కిలోమీటర్ల దూరం పూర్తిగా అడవిలో ఉంటుంది. పూర్వం ఇక్కడ పాదాలు, కోనేరు, సత్రాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి కనుమరుగయ్యాయి. గతంలో చాలామంది భక్తులు ఈ దారి గుండా తిరుమలకు వెళ్లేవారు. ఇప్పుడు తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకుంటున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రతి ఏటా స్థానికులు, భక్తులతో కలిసి ఈ మార్గంలోనే తిరుమలకు చేరుకునేవారు. అయితే ప్రస్తుతం ఏనుగుల గుంపు తిరుగుతుండటంతో భక్తులు ఈ మార్గం నుంచి వెళ్లొద్దని సూచిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి