Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Investment: 45 ఏళ్లకే రిటైర్మెంట్.. చిన్న పెట్టుబడితో రూ. 4.7 కోట్లు పోగేసిన సామాన్యుడు సక్సెస్ స్టోరీ..

12 July 2025

World Sanskrit Conference: ప్రపంచ సంస్కృత మహాసభలో “అక్షర-పురుషోత్తమ దర్శనం”పై స్పెషల్ సెషన్

12 July 2025

Stay Sharp: వయసుతో పనిలేదు.. ఈ 10 టిప్స్ పాటిస్తే మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది..

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirupati Trains,తిరుపతి వెళ్లే వారికి అలర్ట్.. జూలై 11న ఆ రైలు రద్దు – kadiridevarapalli tirupati train cancelled on july 11 due to track works
ఆంధ్రప్రదేశ్

Tirupati Trains,తిరుపతి వెళ్లే వారికి అలర్ట్.. జూలై 11న ఆ రైలు రద్దు – kadiridevarapalli tirupati train cancelled on july 11 due to track works

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirupati Trains,తిరుపతి వెళ్లే వారికి అలర్ట్.. జూలై 11న ఆ రైలు రద్దు – kadiridevarapalli tirupati train cancelled on july 11 due to track works
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అనంతపురం జిల్లా ప్రజలకు గమనిక! జూలై 11న కదిరిదేవరపల్లి-తిరుపతి రైలు రద్దు చేశారు. రాయదుర్గం-సోమలాపురం మధ్య ట్రాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, జూలై 12 నుండి రైలు యథావిధిగా నడుస్తుందని అధికారులు తెలిపారు. తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ మార్పును గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కదిరిదేవరపల్లి తిరుపతి రైలు రద్దు
కదిరిదేవరపల్లి తిరుపతి రైలు రద్దు (ఫోటోలు– TIMESOFINDIA.COM)

అనంతపురం జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే వారికి ముఖ్య గమనిక. జూలై 11న కదిరిదేవరపల్లి – తిరుపతి రైలు రద్దు అయ్యింది. ట్రాక్ పనుల నేపథ్యంలో కదిరిదేవరపల్లి – తిరుపతి రైలును జూలై 11న రద్దు చేసినట్లు కళ్యాణదుర్గం రైల్వేస్టేషన్ అధికారులు వెల్లడించారు. రాయదుర్గం- సోమలాపురం మధ్య రైల్వే్ ట్రాక్ పనులు జరుగుతున్నాయని.. ఈ కారణంగానే జూలై 11వ తేదీ కదిరిదేవరపల్లి – తిరుపతి రైలు రద్దు చేసినట్లు తెలిపారు. అయితే జూలై 12 నుంచి ఈ రైలు యథాతథంగా సేవలు అందిస్తుందని వెల్లడించారు. కదిరిదేవరపల్లి తిరుపతి ప్యాసింజర్ రైలు వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది 57478 నంబర్‌తో కదిరిదేవరపల్లి నుంచి తిరుపతికి రోజూ అందుబాటులో ఉంటుంది.

కదిరిదేవరపల్లిలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరే ఈ రైలు.. మరుసటి రోజు ఉదయం 3 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. దాదాపు 536 కి.మీ. దూరాన్ని 12 గంటల 25 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 44 స్టేషన్లలో ఆగుతుంది, గుంతకల్, ధర్మవరం జంక్షన్‌లలో ఎక్కువ సమయం ఆగుతుంది. కదిరిదేవరపల్లి తిరుపతి రైలు ప్యాసింజర్ కావటంతో.. తిరుపతికి వెళ్లాలనుకునే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ రైలు ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అనంతపురం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

మరోవైపు అనంతపురం జిల్లా నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువ మంది కదిరిదేవరపల్లి తిరుపతి ప్యాసింజర్ రైలు ద్వారా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అలాగే తిరుపతి నుంచి తిరిగి వచ్చేందుకు కూడా ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అయితే ట్రాక్ పనుల నేపథ్యంలో జూలై 11న కదిరిదేవరపల్లి – తిరుపతి రైలు రద్దు చేశారు. దీంతో ఆ రోజు తిరుపతికి ప్రయాణాలు ప్లాన్ చేసుకున్న వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. జూలై 12 నుంచి యథావిధిగా ఈ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

మరోవైపు అనంతపురం బెంగళూరు మధ్య ఇటీవల ప్యాసింజర్ రైలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి ఉన్న రైలును అనంతపురం వరకూ పొడిగించారు. దీంతో కేవలం రూ.50 లతోనే బెంగళూరుకు వెళ్లే వెసలుబాటు ఈ ప్రాంతవాసులకు కలిగింది. దీంతో అనంతపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి