Addanki Narketpalli National Highway Diesel: ఏపీ హైవేలపై లారీ డ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు.. వారిని కొత్త సమస్య వెంటాడుతోంది. హైవేపై రాత్రిళ్లు లారీ ఆపితే నిద్రలేచేసరికి ట్యాంకులు ఖాళీ అవుతున్నాయట. ఎవరీ దొంగలు? ఎందుకీ దారుణాలు? అద్దంకి-నార్కట్పల్లి హైవేపై డీజిల్ దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. నిత్యం వాహనదారులను బెదిరించి దోచుకుంటున్నారు. పోలీసులు రంగంలోకి దిగి గస్తీ ముమ్మరం చేశారు. అసలు ఈ ముఠా ఎలా పనిచేస్తుంది? వీరి వెనుక ఎవరున్నారు? అనేది తేల్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
హైలైట్:
- ఏపీలో ఆ హైవేలో వెళ్లాలంటే డ్రైవర్లకు భయం
- రాత్రిళ్లు లారీని ఆపాలంటేనే ఆలోచిస్తున్నారు
- ఆ గ్యాంగ్ దెబ్బకు వణుకు పుడుతోందట

ఇక ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్.. సర్కార్ కీలక నిర్ణయం
గతంలోనే వీరిపై నకరికల్లు, అమరావతి, రాజుపాలెం, పెదకూరపాడు పోలీస్ స్టేషన్లలో చాలా కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. కొండమోడు, నకరికల్లు, పిడుగురాళ్ల, చిలకలూరిపేట ప్రాంతాల్లో ఈ తరహా డీజిలు చోరీలు ఎక్కువగా చేసినట్లు పాత రికార్డులు చెబుతున్నాయట. పాపం కొందరు లారీ డ్రైవర్లు ఫుల్ ట్యాంక్ చేయించి అలా హైవే పక్కకు ఆపుకుని నిద్రలోకి జారుకున్నారు.. దొంగలు డీజిల్ మొత్తాన్ని కాజేశారు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయంటున్నారు. అయితే ఈ డీజిల్ చోరీలపై పోలీసులు స్పందించారు.. డీజిల్ దొంగతనం చేసినట్లు విచారణలో గుర్తించామని.. ఆయిల్ దొంగల ముఠాకు బ్రేకులు వేస్తామంటున్నారు. అంతేకాదు రాత్రి సమయంలో గస్తీ పెంచుతామన్నారు.. చోరీలకు అడ్డుకట్ట వేస్తామంటున్నారు.