పాలకూర: ఇటీవల జరిగిన సర్వేలో ఫుడ్ పాయిజనింగ్కు కారణమయ్యే ఆహారాలు ఎన్ని ఉన్నాయి. ఏవున్నాయో అని తెలుసుకున్నారు. ఇందులో పాలకూర నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. కాబట్టి తినే ముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.
గుడ్లు: కోడి గుడ్డుపై అతుక్కుపోయి కొన్ని క్రిములు ఉన్న కారణంగా వాటిని అలాగే తీసుకుంటే రోగాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. ఇవి కడుపులోకి చేసితే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కలించవచ్చు. పిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వారు ముఖ్యంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే గుడ్లు కడిగిన తర్వాతే తినాలి.
చికెన్: మాంసంలో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. ఏది జ్వరం, జీర్ణశయాంతర సమస్యలు కారణమవుతుంది. చికెన్ కిదిగినప్పటికీ ఈ బ్యాక్టీరియా ఇంకా మిగిలి ఉంటుంది. ఉందుకే పచ్చి చికెన్ను బాగా కడగాలి ఉపయోగించాలి. చికెన్ను కట్ చేసిన వెంటనే కట్టింగ్ బోర్డులు, కత్తులను శుభ్రంగా కడగాలి.
ట్యూనా చేప: డీఫ్రాస్ట్ చేసిన చేపల స్టోర్ చేసినప్పుడు జాగ్రత్త వహించకుంటే స్కాంబ్రోటాక్సిన్ అనే టాక్సిక్ ప్రొటీన్ ఏర్పడుతుంది. ఇది చర్మపై దద్దుర్లు, వాంతులు, పొత్తికడుపు నొప్పి, అతిసారం, అధిక హృదయ స్పందన రేటు, దృష్టిని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉంది.
చీజ్: చీజ్లో ఎటువంటి విషపూరిత రసాయనాలు లేనప్పటికీ దీన్ని తయారుచేసినప్పుడు కల్తీ జరిగితే మాత్రం విషంగా మారుతుంది. దీని తయారీ సమయంలో జబ్బుపడిన జంతువులు దగ్గర లేకుండా చూసుకోవాలి. పాశ్చరైజ్డ్ పాలను ఉపయోగించడం వల్ల బ్రూసెల్లోసిస్, లిస్టెరియోసిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది.