ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భూమి లేని మరో 1575 కుటుంబాలకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమరావతిలో భూమి లేని సుమారు 19 వేల మందికి పింఛన్లు అందిస్తున్నారు. తొలుత రూ.2500గా ఉన్న ఈ పింఛన్లను ఆ తర్వాత రూ.5000లకు పెంచారు. తాజాగా మరో 1575 కుటుంబాలకు పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో ఉండే 29 గ్రామాలలో భూములు లేని పేదలకు 2014- 2015 నుంచి పింఛన్లు అందిస్తున్నారు. తొలుత నెలకు రూ.2500 పింఛన్ రూపంలో అందించగా.. ఆ తర్వాత పింఛన్ మొత్తాన్ని రూ.5000లకు పెంచారు. అయితే వైసీపీ హయాంలో వీరికి పింఛన్లు సరిగా పంపిణీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల పంపిణీ కోసం నిధులు కూడా విడుదల చేసింది.
Nara Lokesh amaravati speech: వంద పాకిస్థాన్లకు సమాధానం చెప్పే మిసైల్ మోదీ.. గడ్డి కూడా పీకలేరు..
అమరావతిలో 19 వేలమంది వరకూ భూమిలేని పేదలకు పింఛన్లు అందిస్తున్నారు. ఇప్పుడు మరో 1575 కుటుంబాలకు అందించనుండటంతో ఈ సంఖ్య 20 వేలు దాటనుంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ సమయంలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు, భూములు లేని పేదలకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఆ మేరకు కౌలు డబ్బులు, పింఛన్లు అందిస్తోంది. ఇక అమరావతిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటం వ్యాలీ, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాలను చేపట్టనుంది. ఇందుకోసం రెండోసారి భూమిని సమీకరించే ఆలోచనలో ఉంది. రాజధాని భవిష్యత్తు అవసరాల కోస మరింత భూమి అవసరం అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. అమరావతి ఎయిర్పోర్టు కోసం 5000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం 2500 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేస్తోంది.