ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వచ్చేవారికి దేవస్థానం కీలక సూచన చేసింది. ఈ వారం (మంగళవారం నుండి శుక్రవారం వరకు) ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇటీవల శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో జలాశయం నిండుకుండలా మారింది. దీనితో పాటు ఇటీవలే వారాంతం నుంచి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు అవస్థలు తలెత్తకుండా… నిర్వహణపై భారం పడకుండా ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపినట్టు అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం ప్రకారం జూలై 16 (మంగళవారం) నుంచి 19 (శుక్రవారం) వరకు మధ్యాహ్నం 1:45 నుంచి 3:40 గంటల మధ్య కల్పించే ఉచిత స్పర్శ దర్శనం అందుబాటులో ఉండదు. ఈ సమయంలో స్పర్శ దర్శనానికి క్యూలైన్లో నిలిచే భక్తులకు కేవలం అలంకార దర్శనమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ముందుగానే ఈ విషయాన్ని గుర్తించాలంటూ.. దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు ఇదిలా ఉండగా.. పరిస్థితికి అనుగుణంగా తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..