Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Annamayya Lorry Accident,అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది కూలీలు మృతి – annamayya district road accident pullampet lorry crash

13 July 2025

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

13 July 2025

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Woman Return Thalliki Vandanam Money,తల్లీ నీకు వందనం.. నారా లోకేష్ ట్వీట్.. ఏమైందంటే? – mother returns thalliki vandanam scheme amount to school development in srikakulam nara lokesh reaction
ఆంధ్రప్రదేశ్

Woman Return Thalliki Vandanam Money,తల్లీ నీకు వందనం.. నారా లోకేష్ ట్వీట్.. ఏమైందంటే? – mother returns thalliki vandanam scheme amount to school development in srikakulam nara lokesh reaction

.By .13 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Woman Return Thalliki Vandanam Money,తల్లీ నీకు వందనం.. నారా లోకేష్ ట్వీట్.. ఏమైందంటే? – mother returns thalliki vandanam scheme amount to school development in srikakulam nara lokesh reaction
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.13000 జమ చేసింది. అయితే శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఒక మహిళ తన కుమారుడికి వచ్చిన డబ్బును, మరో రెండు వేలు కలిపి పాఠశాల అభివృద్ధికి విరాళంగా ఇచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు చాలని, ఈ డబ్బును పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని ఆమె కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

తల్లీ నీకు వందనం.. నారా లోకేష్ ట్వీట్.. ఏమైందంటే?
తల్లీ నీకు వందనం.. నారా లోకేష్ ట్వీట్.. ఏమైందంటే? (ఫోటోలు– Samayam Telugu)

బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండాలని.. పేదరికం చదువుకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. జూన్ 12 నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభించగా.. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13000 చొప్పున జమ చేశారు. అయితే తనకు వచ్చిన తల్లికి వందనం డబ్బులు వెనక్కి ఇచ్చేసిందో అమ్మ. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ అమ్మను అభినందిస్తూ.. తల్లీ నీకు వందనం అంటూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

“పిల్లల చ‌దువుకు త‌ల్లిదండ్రుల్లా ఆలోచిస్తూ కూట‌మి ప్రభుత్వమే అన్నీ స‌మకూరుస్తోంద‌ని, త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం కింద‌ త‌న ఖాతాలో ప‌డిన 13 వేలుకి మ‌రో రెండు వేలు క‌లిపి 15 వేలు పాఠ‌శాల అభివృద్ధికి వినియోగించాల‌ని అందించిన త‌ల్లీ నీకు వంద‌నం. శ్రీకాకుళం జిల్లా గార మండ‌లం క‌ళింగ‌ప‌ట్నం-మ‌త్స్యలేశం ప్రభుత్వ పాఠ‌శాల‌లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న కుమారుడికి వ‌చ్చిన త‌ల్లికి వంద‌నం నిధులు అదే పాఠ‌శాల అభివృద్ధికి అందించిన త‌ల్లికి అభినంద‌న‌లు. విద్యా వ్యవ‌స్థ బ‌లోపేతానికి మేము చేస్తున్న కృషికి మీలాంటి వారి స‌హ‌కారం తోడు కావ‌డం చాలా సంతోషం.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వస్తే.. కళింగపట్నం – మత్స్యలేశం ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మత్స్యలేశం గ్రామానికి చెందిన ఓ మహిళ కుమారుడు.. స్థానికంగా ఉన్న పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. దీంతో తల్లికి వందనం పథకం కింద ఆమె బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం రూ.13000 జమ చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన రూ.13000లతో పాటుగా మరో రూ.2000 కలిపి మొత్తం రూ.15000 స్కూలుకు ఇచ్చేసిందా మహిళ.

ప్రభుత్వం తన కొడుకు చదువుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పించిందని.. యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు.. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారని.. తమకు అవి చాలని ఆ మహిళ చెప్పింది. తల్లికి వందనం డబ్బులు తమకు అవసరం లేదని.. ఈ 15 వేలు స్కూలు అభివృద్ధికి ఉపయోగించండి అంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం సందర్భంగా స్కూలు హెడ్మాస్టర్ చేతికి అందజేసింది. దీంతో ఈ విషయం వైరల్ కాగా.. నారా లోకేష్ ఆ మహిళను అభినందించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి