BITS Pilani at Amaravati in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ రానుంది. రూ.1000 కోట్లతో 35 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులతో 7000 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. మరోవైపు ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ సంస్థలు కలిసి క్వాంటం వ్యాలీని, హెచ్సీఎల్ టెక్నాలజీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.

రెండు విడతల్లో 7000 మంది విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ (ఏఐ ప్లస్) క్యాంపస్లో చేర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు. అమరావతిలో 35 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ ), మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అందించనున్నారు. ఆర్ఠిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజీలలో ఆయా కోర్సులు అందించే ఆలోచనలో ఉన్నారు.
*28 ఏళ్ల యువకుడికి పార్టీలో పరిచయమైన 40 ఏళ్ల వివాహిత.. ఆ తర్వాతే అసలు కథ, పాపం పసివాడు!
దీనితో పాటుగా.. మౌలిక వసతులు, రీసెర్చ్, డెవలప్మెంట్ సామర్థ్యం పెంచుకునేందుకు మరో రూ.1219 కోట్లు ఖర్చు చేయాలని బిట్స్ యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు బిట్స్ పిలాని యాజమాన్యం సొంతంగా బిట్స్ పిలాని డిజిటల్ పేరుతో సొంతంగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్లా్ట్ ఫామ్ తీసుకువచ్చింది. మరో ఐదేళ్లలో బిట్స్ పిలాని డిజిటల్ ద్వారా 32 ప్రోగ్రామ్స్ లాంఛ్ చేయాలని భావిస్తోంది. ఇందులో 11 డిగ్రీ కోర్సులు కాగా.. మరో 21 సర్టిఫికేట్ కోర్సులు ఉండనున్నాయి.
మరోవైపు ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ సంస్థలు కలిసి అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.2026 జనవరి ఒకటి నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది.
గురుపౌర్ణమి రోజు పున్నమి చంద్రుని దర్శనం చేసుకున్నా.. చంద్రబాబును చూసి మహిళ భావోద్వేగం
ఇక మంగళగిరి ఐటీ పార్కులో హెచ్సీఎల్ టెక్నాలజీస్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. వీటితో పాటుగా పై కేర్ సర్వీసెస్ కూడా మంగళగిరిలో పెట్టుబడులు పెట్టనుంది. అలాగే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కోసం భూములు కేటాయించారు. వీటి ఏర్పాటు ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి ఉపయోగపడతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.