Retired Engineer Murder by Care Taker Vijayawada: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడ రిటైర్డ్ ఇంజనీర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామారావు ఇంట్లో పనిమనిషిగా ఉన్న అనూష, తన భర్త సాయంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనూష అలియాస్ పల్లపు మంగ గురించి పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసి వచ్చాయి.

*28 ఏళ్ల యువకుడికి పార్టీలో పరిచయమైన 40 ఏళ్ల వివాహిత.. ఆ తర్వాతే అసలు కథ, పాపం పసివాడు!
అనూష స్వస్థలం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొత్తగూడెం. అనూష అలియాస్ పల్లపు మంగకు 12వ ఏటనే పెళ్లి జరిగింది.12 ఏళ్లు వయసు ఉన్నప్పుడే అనూష, రమేష్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఐదేళ్ల కిందట అనూష.. భర్త రమేష్, పిల్లలను వదిలేసి విజయవాడకు వచ్చేసింది. అక్కడే ఇళ్లల్లో పనిచేస్తూ కొంతకాలం గడిపింది. ఆ తర్వాత హైదరాబాద్కు అనూష మకాం మార్చింది. హైదరాబాద్లో ఉన్న సమయంలో డేటింగ్ యాప్లో రాజా అనే వ్యక్తి అనూషకు పరిచయమయ్యాడు. దీంతో అనూష అలియాస్ పల్లపు మంగ.. రాజాను రెండో పెళ్లి చేసుకుంది. ఏడాది గడిచిన తర్వాత ఏం జరిగిందో ఏమో.. రాజాను కూడా అనూష వదిలేసింది.
Vijayawada Retired Engineer Murder: ఇంటి ఓనర్ను చంపిన పనిమనిషి
అయితే డేటింగ్ యాప్ ద్వారా మరో వ్యక్తి అనూషకు పరిచయం అయ్యాడు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఉపేంద్ర రెడ్డి అనే వ్యక్తి డేటింగ్ యాప్లో అనూషకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మే నెలాఖరులో వీరి వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్న రిటైర్డ్ ఇంజనీర్ రామారావు ఇంట్లో ఇటీవల కేర్ టేకర్గా చేరింది అనూష. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే రామారావు ఇంట్లో భారీగా డబ్బులు, నగలు ఉంటాయనే ఆలోచన వచ్చింది అనూషకు. ఆ ఆలోచనే క్రూరమైన పని చేసేలా చేసింది.
*యువతీ, యువకుడి మధ్య గొడవ పెట్టిన కుక్క.. రెండు వర్గాల మధ్య వివాదం..
రామారావును అడ్డు తొలగించుకుంటే భారీగా నగలు, డబ్బులు దక్కుతాయని మూడో భర్త అయిన ఉపేంద్రకు నచ్చజెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతున్న రామారావును ఇద్దరూ కలిసి దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత మంచం మీద కారం చల్లారు. అనంతరం ఇంట్లో డబ్బులు, నగలు కోసం గాలించగా ఎలాంటివి లభించలేదు. దీంతో బీరువాలో ఉండే రూ.50000 తీసుకుని పరారయ్యారు. అయితే ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు.. సాంకేతికత సాయంతో నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేశారు.