Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టీతో పాటు అస్సలే తీసుకోకూడని ఆహార పదార్థాలు ఇవే!

30 July 2025

పేదరికం నుంచి బయటపడాలంటే, తప్పక పాటించాల్సిన వాస్తు టిప్స్ ఇవే!

30 July 2025

Nara Lokesh: రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌.. క్యాపిటాల్యాండ్ CEOతో మంత్రి లోకేష్‌ చర్చలు!

30 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Guntur Bring Steel Box Get Mutton Chicken Discount,గుంటూరు ప్రజలకు బంపరాఫర్.. ప్రతి షాపులో మటన్, చికెన్‌కు ధరలపై డిస్కౌంట్.. కాకపోతే ఈ చిన్న పనిచేయాలి – chicken and mutton price reduce rs 10 per kg for people who bring steel boxes to shops in guntur
ఆంధ్రప్రదేశ్

Guntur Bring Steel Box Get Mutton Chicken Discount,గుంటూరు ప్రజలకు బంపరాఫర్.. ప్రతి షాపులో మటన్, చికెన్‌కు ధరలపై డిస్కౌంట్.. కాకపోతే ఈ చిన్న పనిచేయాలి – chicken and mutton price reduce rs 10 per kg for people who bring steel boxes to shops in guntur

.By .18 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Guntur Bring Steel Box Get Mutton Chicken Discount,గుంటూరు ప్రజలకు బంపరాఫర్.. ప్రతి షాపులో మటన్, చికెన్‌కు ధరలపై డిస్కౌంట్.. కాకపోతే ఈ చిన్న పనిచేయాలి – chicken and mutton price reduce rs 10 per kg for people who bring steel boxes to shops in guntur
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Guntur Discount On Mutton Chicken Steel Box: గుంటూరు ప్రజలకు శుభవార్త! మాంసం ప్రియులకు ఇది నిజంగా పండగే. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. స్టీల్ బాక్సులతో వస్తే చికెన్, మటన్ ధరలపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, గుంటూరు కార్పొరేషన్ సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డును గెలుచుకుంది. చెత్తకు డబ్బులు ఇచ్చే స్వచ్ఛ రథం కూడా ప్రారంభమైంది. గుంటూరువాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!

హైలైట్:

  • గుంటూరు ప్రజలకు సరికొత్త ఆఫర్
  • మటన్, చికెన్ ధరలపై డిస్కౌంట్
  • కాకపోతే ఈ చిన్న పనిచేయాల్సిందే
గుంటూరు మటన్ చికెన్ ధరలపై డిస్కౌంట్
గుంటూరు మటన్ చికెన్ ధరలపై డిస్కౌంట్ (ఫోటోలు– Samayam Telugu)

గుంటూరు ప్రజలకు ముఖ్యగమనిక.. మటన్, చికెన్ ధరలపై డిస్కౌంట్ ప్రకటించారు. స్టీల్ బాక్సులతో వచ్చే వారికి చికెన్, మటన్ షాపులకు కిలోకు రూ.10 తగ్గిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఇన్ఛార్జి కమిషనర్ చల్లా ఓబులేసు ప్రకటించారు. హోటల్ యజమానులు, చికెన్, మటన్ షాపుల నిర్వాహకులతో కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని అధికారులు నిర్ణయించారు.. అందుకే కిలోకు రూ.10 తగ్గిస్తామని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని ఆపడానికి దాన్ని నిషేధించినట్లు షాపులు, హోటళ్ల దగ్గర బోర్డులు పెట్టాలని ఓబులేసు సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు అమ్మే షాపులపై ఫైన్ వేయాలని ప్రజారోగ్య విభాగానికి చెప్పారు. ప్రజలు సహకరించి కాగితం, వస్త్రం, జనపనార సంచులు వాడాలని కోరారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అధికారులు కోరుతున్నారు.కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ కింద సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డులను అందజేసింది. 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాలకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును గుంటూరు కార్పొరేషన్ గెలుచుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, మేయర్ కోవెలమూడి రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం ఈ అవార్డును అందుకున్నారు. నగరాలు, పట్టణాలు శుభ్రంగా ఉంచడానికి కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛ ర్యాంకులు ఇవ్వడం ద్వారా నగరాలను ప్రోత్సహిస్తున్నారన్నారు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు.

కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అవార్డుల్ని ప్రకటించారు. పరిశుభ్రతలో ఉన్నత ప్రమాణాలు పాటించిన 23 నగరాలను సూపర్ స్వచ్ఛలీగ్‌ నగరాలుగా ప్రకటించారు. 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల జాబితాలో గుంటూరుకు స్థానం దక్కింది. గుంటూరుకు 5స్టార్‌ రేటింగ్ వచ్చింది. తడి, పొడి చెత్తను వేరు చేయడం, తరలిస్తున్నారు. ఒకసారి వాడి పడేసే వస్తువులపై నిషేధం విధిస్తున్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడానికి విద్యార్థులను భాగస్వాములు చేస్తున్నారు.

18 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీలు నీళ్లు.. హంద్రీ నీవా నుంచి విడుదల

గుంటూరు జిల్లాలో స్వచ్ఛ రథం కార్యక్రమం ప్రారంభమైంది. చెత్తకు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బుతోనే నిత్యావసర సరుకులు కొనుక్కోవచ్చు. ప్రజలకు ఇంటి వద్దే చెత్తకు డబ్బులు, సరుకులు అందుతున్నాయి. గుంటూరు రూరల్ మండలం లాల్ పురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిబ్బంది వాహనాల్లో ఇంటింటికీ వెళ్లి పనికిరాని వస్తువులు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి సేకరించిన చెత్తకు విలువ కట్టి, బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. చెత్తకు ఎంత విలువ నిర్ణయించారు?.. ఎలాంటి నిత్యావసర వస్తువులు ఇస్తున్నారో వివరాలను స్వచ్ఛ రథం వాహనంపై రాసి ఉంటుంది. ముందుగా ప్రజల నుండి సేకరించిన చెత్తకు రేటు ప్రకారం డబ్బు ఇస్తారు.. ఆ డబ్బుతో నిత్యావసర సరుకులు కొనుక్కోవచ్చు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి