దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చవితి వేడుకలు శనివారమే అయిపోయినా చాలా చోట్ల సుమారు వారం రోజులకు పైగానే ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే గణపతి విగ్రహాల నిమజ్ఞనం కూడా ప్రారంభమైంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు. తమ ఇంట్లోనే బుల్లి గణపతులను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. కాగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే పూజించండి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది సెలబ్రిటీలు మట్టి విగ్రహాలనే కొని తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సొంతంగా తమ చేత్తోనే మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేసి పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గతంలో అందరూ మట్టి తీసుకొచ్చి ఇంట్లోనే సొంతంగా వినాయకుడిని తయారుచేసి పూజలు చేసే వాళ్లు. కానీ ఇప్పుడు అందరూ బయటే విగ్రహాలు కొనుక్కుంటున్నారు. అయితే హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాత్రం అలా చేయలేదు. బయటి నుంచి మట్టి తీసుకొచ్చి సొంతంగా తమ చేతులతో వినాయక విగ్రహాలను తయారుచేసారు. అనంతరం తమ ఇంట్లో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు.
మట్టి విగ్రహాలను తయారుచేస్తుండగా తీసిన వీడియోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్. అలాగే అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు హీరో, డైరెక్టర్లను అభినందిస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హతో కలిసి గణనాథుడికి పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి
ఇంట్లో మట్టి వినాయకుడిని తయారు చేస్తోన్న విశ్వక్ సేన్..
అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంట్లోనూ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ్ భార్య ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, శర్వానంద్, నాగ శౌర్య, నిఖిల్ సిద్ధార్థ, యాంకర్ లాస్య, ఆది సాయి కుమార్ ఇళ్లలోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇంట్లో మట్టి గణపతి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

