Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నేను లేకుండా ఎలా చేస్తావో చూస్తానన్న హీరో.. ఒక్కసాంగ్‌తో ఇండస్ట్రీ షేక్ చేసిన కృష్ణారెడ్డి

29 July 2025

ఆఫీస్‌ మీటింగ్‌ మధ్యలో వెళ్లి.. బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన టెకీ! అసలేం జరిగిందంటే..

29 July 2025

SIP vs Lumpsum.. 30 ఏళ్లలో ఎక్కువ లాభాలు వచ్చేది ఏది.?

29 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tiruchanur Temple Varalakshmi Vratham Tickets,తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం.. టీటీడీ భారీ ఏర్పాట్లు – ttd to held grand varalakshmi vratam at tiruchanoor sri padmavati temple on august 16
ఆంధ్రప్రదేశ్

Tiruchanur Temple Varalakshmi Vratham Tickets,తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం.. టీటీడీ భారీ ఏర్పాట్లు – ttd to held grand varalakshmi vratam at tiruchanoor sri padmavati temple on august 16

.By .29 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tiruchanur Temple Varalakshmi Vratham Tickets,తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం.. టీటీడీ భారీ ఏర్పాట్లు – ttd to held grand varalakshmi vratam at tiruchanoor sri padmavati temple on august 16
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tiruchanur Sri Padmavathi Ammavari Temple Varalakshmi Vratham: శ్రావణ మాసం పురస్కరించుకుని తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వ్రతంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న దంపతులకు పలు కానుకలు అందజేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, వడ బహుమతిగా అందజేస్తారు.

హైలైట్:

  • తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
  • ఈ నెల 16న వైభవంగా నిర్వహించనున్నారు
  • భక్తులకు కానుకల్ని అందజేయనున్న టీటీడీ
తిరుచానూరు ఆలయం వరలక్ష్మి వ్రతం
తిరుచానూరు ఆలయం వరలక్ష్మి వ్రతం (ఫోటోలు– Samayam Telugu)

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 16వ తేదీ శుక్రవారం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. . ఓ కోటా పూర్తైంది.. అయితే వరలక్ష్మి వ్రతం వర్చువల్ టికెట్లు కోటా ఇంకా ఉన్నాయి.. భక్తులు బుక్ చేసుకోవచ్చు.ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

తిరుమల వెళ్లే సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త

మహామంగళ దేవత, లక్ష్మీ అవతారమైన అలమేలు మంగమ్మ తిరుచానూరు ఆలయంలో జగత్కల్యాణం కోసం అవతరించిన సౌభాగ్యదేవత. తిరుచానూరులో చేసే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలాలు చేకూరుతాయి. వ్రతం చేసే రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు ఏర్పాటుచేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీ దేవిని దర్శించాలి. అర్చకులు మంటపంలో ముగ్గులలో కమలాన్ని ఏర్పాటు చేస్తారు. దాని మధ్యలో కలశాన్ని ఉంచి, దానిపై నారికేళ ఫలాన్ని పెట్టి, దానికి చెవులు, కన్నులు, ముక్కు ఏర్పాటుచేసి ఆభరణాలను అలంకరిస్తారు. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు. రక్ష కట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని సుసంపన్నం గావించి, వ్రతమహత్యం కథను కూడా చక్కగా పఠించడం జరుగుతుంది.

భార‌తీయ సంస్కృతికి వైఖాన‌స ఆగ‌మ శాస్త్ర‌మే ప్ర‌మాణం

తిరుమల శ్రీ వేంకటటేశ్వర స్వామివారి ఆరాధన విధానానికి శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రం మూల‌మ‌ని పండితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ వైఖానస మహర్షి శిష్యుల‌లో ఒక‌రైన శ్రీ క‌శ్య‌ప‌ మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

శ్రీ వైఖానస సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథంతో శాస్త్రాధ్యయనం చేసి సమాజానికి సేవచేయాలన్నారు. శ్రీవిఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ, ఆలయ సంస్కృతికి ఆధారమైన ఆగమశాస్త్రాల పరిరక్షణ సమాజం బాధ్యతగా స్వీకరించాలని, జ్ఞానాన్ని అందించిన మహర్షుల జయంతులను పండుగలుగా జరుపుకుంటూ, ఆలయ సాంప్రదాయాలు పాటిస్తూ, భగవద్దర్శనంతో ప్రశాంత జీవనం పొందాలన్నారు.

శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధినీ సభ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు ప్రసంగిస్తూ, పూర్వ కాలంలో అవతరించిన శ్రీ శ్రీ విఖ‌నస మహర్షి, శ్రీ భృగు, శ్రీ అత్రి, శ్రీ మరీచి, శ్రీ కశ్యప మహర్షుల జ్ఞాన ఫలాలు నేటికీ సమాజాన్ని ధర్మమార్గంలో పయనింపజేస్తూ సమాజాన్ని ఆలయ వ్యవస్థతో అనుసంథానం గావించిందని చెప్పారు. మానవాళిని మహోన్నత స్థితికి చేర్చే ఆరాధనా విధానం శ్రీ కశ్యప మహర్షి జ్ఞానకాండ గ్రంథం లో వివరించారని తెలిపారు. ఈ సభలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఆచార్యులు, ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర పండితులు పాల్గొన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి