Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బటర్ చికెన్ అంటే ఇష్టమా.? ఇంట్లోనే టేస్టీ టేస్టీగా చేనుకోండిలా..

31 July 2025

Youtube: ఆ దేశంలో పిల్లలకు యూట్యూబ్‌ నిషేధం.. ఎందుకో తెలుసా..?

31 July 2025

ఈ మొలకల ఆహారాన్ని పచ్చిగా తిన్నారో.. ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారో తెలుసా

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Annadata Sukhibhava Funds Release,Annadata Sukhibhava: ఆగస్ట్ 2న అన్నదాత సుఖీభవ డబ్బులు.. ఈ మెసేజ్ వచ్చిందా? – ap cm chandrababu to release 3156 crore funds to farmers under annadata sukhibhava scheme on august 2
ఆంధ్రప్రదేశ్

Annadata Sukhibhava Funds Release,Annadata Sukhibhava: ఆగస్ట్ 2న అన్నదాత సుఖీభవ డబ్బులు.. ఈ మెసేజ్ వచ్చిందా? – ap cm chandrababu to release 3156 crore funds to farmers under annadata sukhibhava scheme on august 2

.By .30 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Annadata Sukhibhava Funds Release,Annadata Sukhibhava: ఆగస్ట్ 2న అన్నదాత సుఖీభవ డబ్బులు.. ఈ మెసేజ్ వచ్చిందా? – ap cm chandrababu to release 3156 crore funds to farmers under annadata sukhibhava scheme on august 2
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ రెండో తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు. మొత్తం రూ.3,156 కోట్ల రూపాయలను తొలివిడత సాయం కింద రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

ఆగస్ట్ 2న అన్నదాత సుఖీభవ డబ్బులు.. ఈ మెసేజ్ వచ్చిందా?
ఆగస్ట్ 2న అన్నదాత సుఖీభవ డబ్బులు.. ఈ మెసేజ్ వచ్చిందా? (ఫోటోలు– Samayam Telugu)

ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధుల జమపై క్లారిటీ వచ్చింది. ఆగస్ట్ 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కానుంది. ఆగస్ట్ రెండో తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం – పీఎం కిసాన్ యోజన కింద ఆగస్ట్ 2వ తేదీ రాష్ట్రంలోని అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో రూ. 3,156 కోట్లు జమ చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం విలేకర్లతో మాట్లాడిన ఆయన అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చారు.

మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రాష్ట్రంలోని రైతులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకం అమలు చేస్తూ ఉండటంతో.. జాప్యం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14000, పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం రూ.6000 కలిపి అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20000 అందించనున్నారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను జూన్ నెలలోనే విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే పీఎం కిసాన్ యోజన నిధులు విడుదలలో జాప్యం జరగటంతో అన్నదాత సుఖీభవ కూడా ఆలస్యమైంది. ఆగస్ట్ రెండో తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తారు. అదే రోజున చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనలో అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారు.

మరోవైపు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. రైతు సేవా కేంద్రాలలో ఈ జాబితాను ప్రదర్శిస్తున్నారు. జాబితాలో పేరు లేని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందేందుకు ఈ కేవైసీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ కేవైసీ చేయించుకోని రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాలలో ఈ కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే డబ్బులు జమ కావటానికి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ తప్పనిసరి.

బ్యాంక్ అకౌంట్లకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లేని వారు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేయని రైతులు వెంటనే ఆ పని పూర్తి చేయాలంటూ ఆర్టీజీఎస్ ద్వారా రైతులకు మెసేజులు పంపాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాలలో ఏదైనా పెండింగ్ ఉంటే ఆ రైతులకు సందేశాలు వస్తాయి. ఆలోపే రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేయించుకోవడం మంచిది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి