Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Curd Effects: రోజూ పెరుగు తినే అలవాటుందా..? ఈ విషయం పక్కా తెలుసుకోవాల్సిందే.. లేదంటే..?

31 July 2025

August Planets Transit: ఆగస్టులో పలు గ్రహాల సంచారం.. ఐదు రాశుల వారి జీవితం బంగారు మయం.. చేపట్టిన ప్రతి పని సక్సెస్..

31 July 2025

వాళ్లు నన్ను చంపేస్తారు.. అందుకే నేనే! తల్లికి ఫోన్‌ చేసి గర్భవతి ఆత్మహత్య..

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Srivani Darshan Timings Tirumala,తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల దర్శనం వేళలు మారాయ్.. ఆగస్ట్ 1 నుంచే ప్రారంభం.. – ttd changed tirumala srivani tickets darshan timings from august 1
ఆంధ్రప్రదేశ్

Srivani Darshan Timings Tirumala,తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల దర్శనం వేళలు మారాయ్.. ఆగస్ట్ 1 నుంచే ప్రారంభం.. – ttd changed tirumala srivani tickets darshan timings from august 1

.By .30 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Srivani Darshan Timings Tirumala,తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల దర్శనం వేళలు మారాయ్.. ఆగస్ట్ 1 నుంచే ప్రారంభం.. – ttd changed tirumala srivani tickets darshan timings from august 1
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Srivani Tickets Darshan Timings in Tirumala: భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని.. వారికి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవాణి దర్శనం వేళల్లో టీటీడీ తాజాగా మార్పులు చేసింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి తిరుమలలో శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం వేళలు మారనున్నాయి. ఇకపై శ్రీవాణి దర్శనం టికెట్లను ఏరోజుకు ఆ రోజు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్ట్ 15 వరకూ ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల దర్శనం వేళలు మారాయ్.. ఆగస్ట్ 1 నుంచే ప్రారంభం..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల దర్శనం వేళలు మారాయ్.. ఆగస్ట్ 1 నుంచే ప్రారంభం.. (ఫోటోలు– Samayam Telugu)

Srivani Tickets Darshan Timings in Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. శ్రీవాణి టికెట్ల దర్శనం వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవాణి దర్శనం వేళలు మారనున్నాయి. ఈ విషయంపై టీటీడీ ఓ ప్రకటన జారీ చేసింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఆగస్ట్ 15వ తేదీ వరకూ నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కొత్త విధానంలో భాగంగా శ్రీవాణి దర్శనం టికెట్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం వేళలు మారనున్నాయి. ఈ విషయాన్ని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. శ్రీవాణి దర్శనాలపై టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

*హైదరాబాద్ దంపతుల పెద్దమనసు.. తిరుమల శ్రీవారికి విరాళంగా ఇల్లు.. ఎంత విలువైందో తెలుసా?

శ్రీవాణి దర్శనం టికెట్లను ప్రస్తుతం ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లోనూ టీటీడీ జారీ చేస్తోంది. అయితే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కారణంగా శ్రీవాణి దర్శనం టికెట్లు ఆఫ్‌‍లైన్‌లో పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఏరోజుకు ఆ రోజు శ్రీవాణి దర్శనం టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఏఈవో తెలిపారు. శ్రీవాణి టికెట్లు జారీచేసిన రోజే శ్రీవారి దర్శనం కల్పించాలని.. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఆగస్ట్ 15 వరకూ ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

ఇక శ్రీవాణి దర్శనం టికెట్లను తిరుమలలో ఉదయం పది గంటల నుంచి జారీ చేస్తారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన శ్రీవాణి దర్శనం టికెట్లు జారీ చేస్తారు. అలాగే రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉద‌యం 7 నుంచి దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకూ వీటిని జారీ చేస్తారు. ఆఫ్‌లైన్‌ శ్రీవాణి దర్శనం టికెట్లు రోజూ వేయి వరకూ అందుబాటులో ఉంటాయి. అందులో తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్టులో 200 టికెట్లు జారీ చేస్తారు. శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వ‌ద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకలు.. 2.5 కేజీల బంగారంతో

మరోవైపు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే ఆక్టోబ‌ర్ 31 వరకూ ఆన్ లైన్‌లో శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌ు య‌థావిధిగా ఉద‌యం 10 గంట‌ల‌కే దర్శనానికి అనుమతిస్తారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి శ్రీవాణి దర్శనం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ టికెట్లు పొందిన వారిని సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు ఉదయం 10 గంటలకు మాత్రమే శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం వద్దకు రావాలని టీటీడీ కోరింది. కొత్త విధానంతో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు ఆ రోజునే శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు అవుతుందని టీటీడీ చెప్తోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి