Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సిగ్గుండక్కర్లేదు.. 8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి..! టీచర్‌ ఎంట్రీతో..

31 July 2025

Nandamuri Balakrishna,సైకిల్‌పై బాలయ్య సందడి.. పార్లమెంట్ ఆవరణలో హిందూపురం ఎమ్మెల్యే! – hindupur mla nandamuri balakrishna meet central minister at delhi parliament bhavan

31 July 2025

Viral Video: చిమ్మ చీకట్లో చెట్టు కొమ్మపై ఏదో అలికిడి.. అసలు సీన్ చూసి బెంబేలెత్తిన జనాలు..

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Us 25 Percent Tariff,America to Andhra Pradesh: డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం.. ఏపీపై ఏపాటిది? – us president donald trump 25 percent tariffs on india decision impact on andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Us 25 Percent Tariff,America to Andhra Pradesh: డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం.. ఏపీపై ఏపాటిది? – us president donald trump 25 percent tariffs on india decision impact on andhra pradesh

.By .30 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Us 25 Percent Tariff,America to Andhra Pradesh: డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం.. ఏపీపై ఏపాటిది? – us president donald trump 25 percent tariffs on india decision impact on andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. భారతదేశం మీద 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి సుంకాల విధింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మీద ఎంతమేరకు ప్రభావం చూపుతుందనే విశ్లే్షణలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏపీ నుంచి అమెరికాకు రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఏపీ ఆక్వాకల్చర్ మీద ఏ రకమైన ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం.. ఏపీపై ఏపాటిది?
డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం.. ఏపీపై ఏపాటిది? (ఫోటోలు– Samayam Telugu)

అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు పట్టుకుంటుందనేది సామెత.. అభివృద్ధి చెందిన దేశంగా, అగ్రరాజ్యంగా అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రపంచ దేశాల మీద అంతో ఇంతో ప్రభావం చూపించకమానదు. అలాంటిది భారతదేశం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 25 శాతం సుంకాలు విధించారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి భారత్‌‍పై 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. అమెరికా భారతదేశంపై 25 శాతం సుంకాలు విధించినన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనా ఆ ప్రభావం పడనుంది. అమెరికా తీసుకున్న నిర్ణయం భారతదేశ ఎగుమతులపై ప్రభావం చూపించనుంది. భారతదేశంలోని ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ అండ్ మెషినరీ రంగాలపై ఈ ప్రభావం పడనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఏపీ ఆక్వారంగం మీద ట్రంప్ నిర్ణయం పెనుభారమయ్యే అవకాశాలు ఉన్నాయి.

*ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. ఈ బస్సులకే పరిమితం.. ఈ గుర్తింపు కార్డులు తప్పనిసరి!

ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు రొయ్యలు, సీఫుడ్ ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. మనదేశం నుంచి అమెరికాకు సీఫుడ్స్, రొయ్యలు అత్యధిక మొత్తంలో ఎగుమతి చేసే రాష్ట్రాలలో ఏపీ మొదటిది. అయితే సముద్ర ఆహార ఉత్పత్తులపై అమెరికా 27 శాతం సుంకం విధించనుంది. దీనికి కౌంటర్ వెయిలింగ్, యాంటీ డంపింగ్ డ్యూటీలు అదనమని.. మొత్తంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై 34 శాతం వరకూ పన్ను తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు. ఫలితంగా ఏపీలోని రొయ్యల ఎగుమతిదారులకు ఆర్థిక భారం కానుంది.

*డ్వాక్రా మహిళలకు సూపర్ న్యూస్.. అద్భుత అవకాశం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.!

ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వారంగం మీద ఆధారపడి ఉన్న దాదాపు 8 లక్షల మంది రైతులు, అనుబంధ రంగాల కార్మికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 2023-24లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2.37 బిలియన్ డాలర్ల విలువైన 347,927 టన్నుల సీఫుడ్ ఎగుమతి జరిగింది. ఇందులో రొయ్యల వాటానే 76 శాతంగా ఉందంటే.. ఏపీ నుంచి ఏ స్థాయిలో అమెరికాకు రొయ్యల ఎగుమతులు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ట్రంప్ నిర్ణయంతో ఏం జరుగుతుంది?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా రొయ్యల ఎగుమతిదారులు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే అమెరికాకు ఎగుమతి చేయటం కోసం కోల్డ్ స్టోరేజీలలో ఉంచిన రొయ్యలు, సీఫుడ్స్ నిల్వలు పేరుకుపోయే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో రొయ్యల సేకరణ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా రొయ్యల ధరలు పతనమై.. ఆక్వారైతులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆక్వాకల్చర్ మీద ఆధారపడి ఉండే కోల్డ్ స్టోరేజీ, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ రంగాలలో డిమాండ్ తగ్గి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

మరోవైపు వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాలు భారతదేశం నుంచి సీఫుడ్ కొనుగోలు చేసి.. వాటిని ప్రాసెసింగ్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తుంటాయి. ట్రంప్ నిర్ణయంతో ఆయా దేశాల నుంచి ఆక్వాకల్చర్ సాగుచేసేవారికి ఆర్డర్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏపీలోని రొయ్యల ఎగుమతుదారులను మరింత ఇబ్బందిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సుమారు 5 లక్షల మంది ఆక్వా రైతులు జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తనున్నాయి.

Tariff Effect on AP Exports : తస్సాదియ్యా రొయ్యా.. ఎంత పనిచేశావే?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయం ఏపీలోని ఆక్వా రైతులకు శాపంగా మారకూడదంటే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం మద్దతుగా నిలవడంతో పాటుగా రాయితీలు ఇవ్వాలంటున్నారు. ఆక్వా రైతుల వ్యయం తగ్గించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే యూనిట్‌ రూ. 1.50 చొప్పున విద్యుత్ రాయితీని అందిస్తోంది.

ఆక్వా రైతులు, వ్యాపారులు, దాణా సరఫరాదారులు, ఎగుమతిదారులు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా మీదే ఎక్కువగా ఆధారపడకుండా ఇతర దేశాలకు కూడా రొయ్యలు, సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సరైన ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. సుంకాల మినహాయింపు, తగ్గింపుపై అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరిపేలా కేంద్రాన్ని కోరవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి