Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood : పిల్లలకు పాలు పడుతోన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. అసలు విషయమేమిటంటే?

31 July 2025

Video: మరీ ఇంత నిర్లక్ష్యమా..? టిక్కెట్ల కోసం లైన్లో ప్రయాణికులు.. తీరిగ్గా ఫోన్లో ముచ్చట్లు పెట్టిన క్లర్క్‌!

31 July 2025

బెంగుళూరులో హడలెత్తించిన సైకో పోలీస్ రియల్‌ కథ! ది బెస్ట్ డార్క్‌ థ్రిల్లర్ సిరీస్‌!

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Pregnant Lady,ఇంట్లో గర్భిణి ఒంటరిగా ఉండటం చూసి.. కుర్చీకి కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి.. మరీ ఇంత దారుణమా? – pregnant woman tied up and gold jewellery stolen in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Pregnant Lady,ఇంట్లో గర్భిణి ఒంటరిగా ఉండటం చూసి.. కుర్చీకి కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి.. మరీ ఇంత దారుణమా? – pregnant woman tied up and gold jewellery stolen in visakhapatnam

.By .30 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Pregnant Lady,ఇంట్లో గర్భిణి ఒంటరిగా ఉండటం చూసి.. కుర్చీకి కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి.. మరీ ఇంత దారుణమా? – pregnant woman tied up and gold jewellery stolen in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఓ గర్భిణిని బంధించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు చోరీ చేశారు. ఈ ఘటన ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గర్భిణ ఒంటరిగా ఉండటం గమనించిన ఓ ఆగంతకురాలు ఈ చోరీకి పాల్పడింది. ఈ ఘటనపై బాధితురాలు ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ఇంట్లో గర్భిణి ఒంటరిగా ఉండటం చూసి.. కుర్చీకి కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి.. మరీ ఇంత దారుణమా?
ఇంట్లో గర్భిణి ఒంటరిగా ఉండటం చూసి.. కుర్చీకి కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి.. మరీ ఇంత దారుణమా? (ఫోటోలు– Samayam Telugu)

రోజురోజుకూ దొంగలు బరితెగిస్తున్నారు. పట్టపగలే ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు. తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలు చేయటం ఒక ఎత్తు అయితే… మనుషులు ఉన్నప్పటికీ ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేయడం మరొక ఎత్తు. ఇటీవలి కాలంలో ఇలాంటి దొంగతనాలు పెరిగిపోయాయి. అడ్రస్ కావాలనో, మంచి నీళ్లు ఇవ్వమనో ఇంటి వద్దకు వస్తారు.. ఆ వివరాలు అడుగుతూనే ఇంట్లో ఎవరైనా ఉన్నారేమోనని గమనిస్తారు.. ఎవరూ లేకపోతే ఇంట్లోకి చొరబడి బెదిరించి అందినకాడికి దోచుకుపోతారు. అలాంటి ఘటనే విశాఖపట్నంలో జరిగింది. ఓ గర్భిణిని ఇంట్లో బంధించి చోరీకి పాల్పడిందో మహిళ. గర్భిణి ఒంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకుని ఉడాయించింది. విశాఖపట్నంలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితులు చెప్తున్న వివరాల ప్రకారం.. మధుశ్రీ అనే మహిళ భర్తతో కలిసి సీతంపేటలో నివశిస్తున్నారు. మధుశ్రీ ప్రస్తుతం గర్భవతి. దీంతో ఆమె భర్త ఎక్కడున్నా సరే ఫోన్ చేసి ఆమె బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఐదు రోజుల క్రితం మధుశ్రీ భర్త ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్లారు. ఇదే సమయంలో మధుశ్రీ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. దీంతో ఎవరొచ్చారో చూద్దామంటూ మధుశ్రీ తలుపు తీసి చూశారు. అయితే అక్కడ ఎవరూ కనిపించలేదు. భ్రమ పడ్డానేమో అనుకుంటూ మధుశ్రీ ఇంట్లోకి వచ్చేలోపు.. ఓ ఆగంతకురాలు వేగంగా ఇంట్లోకి ప్రవేశించింది. గర్భిణీగా ఉన్న మధుశ్రీని కుర్చీలో కూర్చోపెట్టి.. రెండు చేతులు బలవంతంగా కట్టేసింది. ఆపై అరవకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి.. మధుశ్రీ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయింది.

అయితే మధుశ్రీ భర్త.. ఆమెకు ఫోన్ చేశాడు. ఎంతకూ ఫోన్ తీయకపోవటంతో ఇంటికి వచ్చి చూస్తే.. కుర్చీలో మధుశ్రీ కట్టేసి ఉంది. వెంటనే మధుశ్రీ, ఆమె భర్త కలిసి ద్వారకా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాలుగున్నర తులాల బంగారం గొలుసు చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ ఆచూకీ కనిపెట్టేందుకు సమీపంలోని సీసీ ఫుటేజీను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మహిళ ఆచూకీ తెలియలేదు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న గర్భిణిని బంధించి చోరీ చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి