Director Teja Company Mou Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్లో ఐదు రోజుల పర్యటనను పెట్టుబడుల లక్ష్యంగా పూర్తి చేసింది. డైరెక్టర్ తేజ అమెరికా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదిరింది. చంద్రబాబు నాయుడు కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ వంటి సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
హైలైట్:
- సింగపూర్లో చంద్రబాబు అండ్ టీమ్
- టాలీవుడ్ డైరెక్టర్కు అమెరికాలో కంపెనీ
- ఆ కంపెనీతో ఎంవోయూ చేసుకున్నారు

సింగపూర్ పర్యటనలో చివరి రోజు కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్-బెంగళూరు-అమరావతి-చెన్నైల మధ్య ఎయిర్ పోర్టు ఎకనమిక్ కారిడార్ గురించి సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయి.. వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి.. పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల ద్వారా అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నాము’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు. వివరించారు.
‘వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్శిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించండి. విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం రంగంలో భాగస్వామ్యంతో వెళ్తే మంచి చక్కటి అభివృద్ధి సాధించవచ్చు. సింగపూర్ గార్డెన్ సిటీ, జూ పార్క్ మోడళ్లను ఏపీలో అమలు చేయాలి’ అని చంద్రబాబు మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సంస్థ సీఈవో మైక్ బార్క్లేకు సూచించారు. ‘అంశంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. విశాఖపట్నంలో డాల్ఫిన్ సిటీ, అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలతో వెళ్తున్నాము.. వాటిల్లో మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలి’ అని కోరారు. ఈ మేరకు ఆయా రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సుముఖత వ్యక్తం చేశారు.
జపాన్కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్-SMBC మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగర అభివృద్ధిలో పెట్టుబడులపై చర్చించారు. ముఖ్యంగా లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతాల్లో డ్రోన్ సిటీ, డిఫెన్స్, సివిల్ ఎరో స్పేస్ కారిడార్ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేసే అంశంపై చర్చ జరిగింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారం అందించాలని సీఎం కోరారు.
పెట్టుబడుల దిగ్గజం టెమాసెక్ హెల్డింగ్స్కు చెందిన దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి టెమాసెక్ హెల్డింగ్స్ ఆసక్తి చూపింది. ఏపీఐఐసీతో కలిసి పనిచేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సీఎం సూచించారు. ఎంఎస్ఎంఈ రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థ సిద్ధంగా ఉంది. వివిధ రంగాల్లో జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు చేపట్టే అంశంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యం, టెక్నాలజీ వంటి రంగాల్లో ఏపీలో అవకాశాలున్నాయని సీఎం వివరించారు.