Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Baahubali: రీ రిలీజ్‌లోనూ రాజమౌళి మార్క్‌.. పక్కా మాస్ ప్లానింగ్ మామా ఇది

31 July 2025

మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్‌..!

31 July 2025

వీర్య నిరోధక మాత్ర పనిచేస్తుంది

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Director Teja Company Mou With Ap Govt,టాలీవుడ్ డైరెక్టర్‌కు అమెరికాలో కంపెనీ.. నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ – andhra pradesh government mou with tesseract company in singapore
ఆంధ్రప్రదేశ్

Director Teja Company Mou With Ap Govt,టాలీవుడ్ డైరెక్టర్‌కు అమెరికాలో కంపెనీ.. నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ – andhra pradesh government mou with tesseract company in singapore

.By .31 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Director Teja Company Mou With Ap Govt,టాలీవుడ్ డైరెక్టర్‌కు అమెరికాలో కంపెనీ.. నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ – andhra pradesh government mou with tesseract company in singapore
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Director Teja Company Mou Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్‌లో ఐదు రోజుల పర్యటనను పెట్టుబడుల లక్ష్యంగా పూర్తి చేసింది. డైరెక్టర్ తేజ అమెరికా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదిరింది. చంద్రబాబు నాయుడు కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ వంటి సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

హైలైట్:

  • సింగపూర్‌లో చంద్రబాబు అండ్ టీమ్
  • టాలీవుడ్ డైరెక్టర్‌కు అమెరికాలో కంపెనీ
  • ఆ కంపెనీతో ఎంవోయూ చేసుకున్నారు
ఏపీ ప్రభుత్వం టెజారాక్ట్‌తో ఎంవోయూ
ఏపీ ప్రభుత్వం టెజారాక్ట్‌తో ఎంవోయూ (ఫోటోలు– Samayam Telugu)

ఏపీ ప్రభుత్వం పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌లో ఐదు రోజుల పాటూ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన బుధవారంతో ముగిసింది.. అయితే టాలీవుడ్ డైరెక్టర్ అమెరికా కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డైరెక్టర్ తేజతో ఈ ఎంవోయూ చేసుకున్నట్లు స్వయంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.. ఫోటోలను కూడా షేర్ చేశారు. డైరెక్టర్ తేజకు అమెరికాలో ఓ కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.. ఆ కంపెనీతోనే ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు.’సింగపూర్ పర్యటనలో మూడో రోజు ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. షాంగ్రీలా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టెజారాక్ట్, US Inc. ప్రెసిడెంట్ తేజ ధర్మ, APAC వైస్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ – యూట్యూబ్ గౌతమ్ ఆనంద్, ఏపీ ప్రభుత్వం ఐటి కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంవోయుపై సంతకాలు చేశారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

సింగపూర్ పర్యటనలో చివరి రోజు కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్-బెంగళూరు-అమరావతి-చెన్నైల మధ్య ఎయిర్ పోర్టు ఎకనమిక్ కారిడార్ గురించి సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయి.. వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి.. పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల ద్వారా అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నాము’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు. వివరించారు.

‘వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్శిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించండి. విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం రంగంలో భాగస్వామ్యంతో వెళ్తే మంచి చక్కటి అభివృద్ధి సాధించవచ్చు. సింగపూర్ గార్డెన్ సిటీ, జూ పార్క్ మోడళ్లను ఏపీలో అమలు చేయాలి’ అని చంద్రబాబు మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సంస్థ సీఈవో మైక్ బార్క్‌లేకు సూచించారు. ‘అంశంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. విశాఖపట్నంలో డాల్ఫిన్ సిటీ, అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలతో వెళ్తున్నాము.. వాటిల్లో మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలి’ అని కోరారు. ఈ మేరకు ఆయా రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సుముఖత వ్యక్తం చేశారు.

జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్-SMBC మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగర అభివృద్ధిలో పెట్టుబడులపై చర్చించారు. ముఖ్యంగా లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతాల్లో డ్రోన్ సిటీ, డిఫెన్స్, సివిల్ ఎరో స్పేస్ కారిడార్ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేసే అంశంపై చర్చ జరిగింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారం అందించాలని సీఎం కోరారు.

పెట్టుబడుల దిగ్గజం టెమాసెక్ హెల్డింగ్స్‌కు చెందిన దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి టెమాసెక్ హెల్డింగ్స్ ఆసక్తి చూపింది. ఏపీఐఐసీతో కలిసి పనిచేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సీఎం సూచించారు. ఎంఎస్ఎంఈ రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థ సిద్ధంగా ఉంది. వివిధ రంగాల్లో జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు చేపట్టే అంశంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యం, టెక్నాలజీ వంటి రంగాల్లో ఏపీలో అవకాశాలున్నాయని సీఎం వివరించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి