Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

BAPS: బీఏపీఎస్ డా. జ్ఞానవత్సలదాస్ స్వామికి అమెరికాలో విశేష గౌరవం

31 July 2025

Tollywood: ఈ ఇద్దరిలో ఒకరు పాన్ ఇండియా హీరోయిన్.. తెలుగులో చేసిన సినిమాలన్నీ హిట్టే.. ఎవరో గుర్తు పట్టారా?

31 July 2025

శ్రావణ మాసంలో వచ్చే కలలకు అర్థం ఏంటో తెలుసా..? ఈ రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి..!

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan Sent Blankets To Tribal People,పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా, ఈసారి ఏం పంపారంటే! – andhra pradesh deputy cm pawan kalyan sent blankets to tribal people
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan Sent Blankets To Tribal People,పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా, ఈసారి ఏం పంపారంటే! – andhra pradesh deputy cm pawan kalyan sent blankets to tribal people

.By .31 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan Sent Blankets To Tribal People,పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా, ఈసారి ఏం పంపారంటే! – andhra pradesh deputy cm pawan kalyan sent blankets to tribal people
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Pawan Kalyan Blankets For Tribal People: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులకు అండగా నిలిచారు. మక్కువ మండలంలోని ప్రజల అవసరాలు తెలుసుకొని 222 కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. గతంలో డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామస్తులకు చెప్పులు, కురిడి గ్రామస్తులకు తన తోటలోని మామిడి పండ్లను పంపారు. గిరిజనుల పట్ల ఆయనకున్న ప్రత్యేక అభిమానానికి ఇది నిదర్శనం. పవన్ కళ్యాణ్ వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా, అవసరాలను తీర్చడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హైలైట్:

  • గిరిజనుల పట్ల పవన్ కళ్యాణ్ ప్రేమ
  • మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు
  • గిరిజనులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు
మన్యం గిరిజనులకు పవన్ కళ్యాణ్ రగ్గులు
మన్యం గిరిజనులకు పవన్ కళ్యాణ్ రగ్గులు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల పట్ల పెద్ద మనసును చాటుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనులకు మరోసారి అండగా నిలిచారు. వారికోసం రగ్గులు పంపించారు.. మక్కువ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజల అవసరాలను తెలుసుకొని ఆయన ఈ సహాయం చేశారు. జిల్లా పీడీ రామచంద్రరావు ఈ విషయాన్ని తెలిపారు. పవన్ కళ్యాణ్ పపించిన ఈ రగ్గుల్ని సిరివర, బాగుజోల, చిలకమెండంగి, బండమెండంగి, డొయివర, తాడిపుట్టి గ్రామాల్లోని 222 కుటుంబాలకు వీటిని పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో మక్కువ మండలంలో జరిగిన పల్లె పండగ కార్యక్రమానికి వచ్చారు. ఆ సమయంలో ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్నారు.. సాయం అందిస్తున్నారు.అంతేకాదు గతంలో అరకులోయ నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామస్తులకు చెప్పులు గిఫ్టుగా పంపించి తన ఆప్యాయతను చాటుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా అదే మండలం పరిధిలోని కురిడి గ్రామస్తులకు తన సొంత తోటలో ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్లను బహుమతిగా పంపించి, ప్రతి ఒక్కరికీ అందజేశారు. గిరిజన ప్రాంతాల పట్ల పవన్ కళ్యాణ్ చూపే ప్రత్యేకమైన అభిమానం ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

Pawan kalyan Slippers: ఆ ఊరికి చెప్పులు పంపిన పవన్ .. ఎందుకంటే?

ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మారుమూల గిరిజన గ్రామాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించడం, వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా, వారి అవసరాలను గుర్తించి ఇలాంటి చిన్న చిన్న సాయాలు చేయడం గిరిజనులను ఎంతో సంతోషపెడుతోంది. తమ గ్రామాన్ని గుర్తుపెట్టుకుని మరీ.. సొంత తోటలో పండిన మామిడి పండ్లను పంపించటం చూసి కురిడి గ్రామస్తులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. “పవన్ బాబు పది కాలాలపాటు చల్లగా ఉండాలి” అంటూ ఈ సందర్భంగా గిరిజనులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తమ ఆశీస్సులను అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత తోటలో పండించిన మామిడి పండ్లను ప్రత్యేకంగా తమ గ్రామానికి పంపించి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారని కురిడి గ్రామస్తులు ఆనందంగా చెప్పారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి